RG Kar rape case: సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్.. ఏం కోరిందంటే..!
- సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్
- మరణశిక్ష విధించాలని దర్యాప్తు సంస్థ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్రాయ్కి ఇటీవల న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. తీర్పును వ్యతిరేకిస్తూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వాదనను సీబీఐ తోసిపుచ్చింది. డిమాండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదని.. దర్యాప్తు సంస్థకే ఉంటుందని సీబీఐ పేర్కొంది. దీంతో నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ హైకోర్టును కోరింది.
ఇది కూడా చదవండి: Post Office Scheme: లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు దేబాంగ్షు బసక్, ఎండీ షబ్బర్ రషీదీలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణ సందర్భంగా.. శిక్షను సవాలు చేసే అధికారం ఈ కేసులో ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీకి మాత్రమే ఉందని సీబీఐ పేర్కొంది. ఈ కేసును తాము విచారించినందున ఈ విషయంలో అప్పీల్కు దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. రాష్ట్రం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్… సీబీఐ వాదనను తిప్పికొడుతూ.. ఈ కేసులో ప్రాథమిక ఎఫ్ఐఆర్ను రాష్ట్ర పోలీసులు దాఖలు చేశారని, ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. ‘‘లా అండ్ ఆర్డర్ రాష్ట్ర అధికార పరిధిలో ఉంది’’ అని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను అంగీకరించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు.. సీబీఐ, బాధితురాలి కుటుంబం, సంజయ్ రాయ్ సమర్పించిన సమర్పణలను పరిశీలిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై సోమవారం (జనవరి 27) తదుపరి విచారణ జరగనుంది.
ఇది కూడా చదవండి: Enemy Act: సైఫ్ అలీ ఖాన్ రూ. 15,000 కోట్ల ఆస్తి కోల్పోయే అవకాశం.. ‘‘ఎనిమి ప్రాపర్టీ’ అంటే ఏమిటి..?
ఆగస్టు 9, 2024న కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. తాజాగా న్యాయస్థానం కూడా దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇదిలా ఉంటే ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. తాజాగా సీబీఐ ఈ వాదనను తోసిపుచ్చి.. తమకే ఆ అధికారం ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!