RG Kar rape case: సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్.. ఏం కోరిందంటే..!
- సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్
- మరణశిక్ష విధించాలని దర్యాప్తు సంస్థ డిమాండ్
కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్రాయ్కి ఇటీవల న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. తీర్పును వ్యతిరేకిస్తూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వాదనను సీబీఐ తోసిపుచ్చింది. డిమాండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదని.. దర్యాప్తు సంస్థకే ఉంటుందని సీబీఐ పేర్కొంది. దీంతో నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ హైకోర్టును కోరింది.
ఇది కూడా చదవండి: Post Office Scheme: లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు దేబాంగ్షు బసక్, ఎండీ షబ్బర్ రషీదీలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణ సందర్భంగా.. శిక్షను సవాలు చేసే అధికారం ఈ కేసులో ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీకి మాత్రమే ఉందని సీబీఐ పేర్కొంది. ఈ కేసును తాము విచారించినందున ఈ విషయంలో అప్పీల్కు దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. రాష్ట్రం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్… సీబీఐ వాదనను తిప్పికొడుతూ.. ఈ కేసులో ప్రాథమిక ఎఫ్ఐఆర్ను రాష్ట్ర పోలీసులు దాఖలు చేశారని, ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. ‘‘లా అండ్ ఆర్డర్ రాష్ట్ర అధికార పరిధిలో ఉంది’’ అని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను అంగీకరించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు.. సీబీఐ, బాధితురాలి కుటుంబం, సంజయ్ రాయ్ సమర్పించిన సమర్పణలను పరిశీలిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై సోమవారం (జనవరి 27) తదుపరి విచారణ జరగనుంది.
ఇది కూడా చదవండి: Enemy Act: సైఫ్ అలీ ఖాన్ రూ. 15,000 కోట్ల ఆస్తి కోల్పోయే అవకాశం.. ‘‘ఎనిమి ప్రాపర్టీ’ అంటే ఏమిటి..?
ఆగస్టు 9, 2024న కోల్కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. తాజాగా న్యాయస్థానం కూడా దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇదిలా ఉంటే ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. తాజాగా సీబీఐ ఈ వాదనను తోసిపుచ్చి.. తమకే ఆ అధికారం ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..
తాజావార్తలు
-
Vastu Tips: మీ డైనింగ్ టేబుల్పై ఈ వస్తువులు పెడుతున్నారా? అయితే దరిద్రం మీ తలుపు తట్టడం ఖాయం!
-
Sugar-Free Lassi Recipe: మండే ఎండ నుంచి తక్షణ ఉపశమనం.. షుగర్ లేకుండా క్షణాల్లో టేస్టీ లస్సీ..
-
Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
-
Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!