AP LPG Supply: ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు.. ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు చేపట్టండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP LPG Supply: గ్యాస్ సరఫరా పై ప్రజలు ఆందోళన కు గురవ్వకుండా చర్యలు తీసుకోవలన్నారు సీఎం చంద్రబాబు… ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని.. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో మరింతగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టిసారించాలన్నారు.
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుందని చెప్పారు. అందువల్ల రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలు వంటి ముఖ్య సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈకేవైసీ మరియు ఓటీపీ విధానాల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజలకు తక్షణం ఉపయోగపడే ప్రత్యామ్నాయాలపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు చేసి, పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మరింతగా విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఏపీలోని Krishna–Godavari Basin (కేజీ బేసిన్) లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!