Post Office Scheme: లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
- లక్షాధికారిని చేసే పోస్టాఫీస్ స్కీమ్
- రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!
- 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు
ఈ రోజు మీరు చేసే పొదుపు రేపు మిమ్మల్ని రక్షిస్తుంది. డబ్బులు చేతిలో ఉంటే నలుగురికి సాయం చేయొచ్చు. అందుకే డబ్బును అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తుంటారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. మరి మీరు కూడా తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్ ఉంది. అదే గ్రామ సురక్ష యోజన. ఇందులో రోజుకు రూ. 50 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటి నాటికి ఏకంగా రూ. 35 లక్షలు అందుకోవచ్చు. పోస్టాఫీసు గ్రామ సురక్ష యోజన గ్రామీణ పౌరులకు ఆర్థిక భద్రత, మంచి రాబడిని అందిస్తుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ కు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. గ్రామ్ సురక్ష యోజన గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఒక భాగం. ఈ గ్రామ సురక్ష యోజనలో 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీరు ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా కూడా చెల్లించొచ్చు. లోన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
Also Read
- Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
- APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
మీరు రూ. 10 లక్షల ప్రీమియం ఎంచుకుంటే.. 19 ఏళ్ల వయసులో ఈ స్కీంలో చేరితే 55 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ. 1515 చొప్పున చెల్లించాలి. 58 ఏళ్ల వరకు ఈ స్కీంలో నమోదు చేసుకుంటే అప్పుడు రూ. 1463, 60 ఏళ్లకు అయితే రూ. 1411 డిపాజిట్ చేయాలి. ఈ పథకంలో మీరు 55 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి రూ. 31.60 లక్షల కార్పస్ పొందుతారు. 58 సంవత్సరాల ప్రీమియం ఎంచుకుంటే మెచ్యూరిటీ నాటికి రూ. 33.40 లక్షల కార్పస్ పొందుతారు. 60 సంవత్సరాల ప్రీమియం ద్వారా రూ. 34.40 లక్షలు అందుకుంటారు. పోస్ట్ ఆఫీస్ గ్రామ సురక్ష యోజనలో పెట్టుబడిదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి మొత్తం ఫండ్ అందుతుంది. తద్వారా పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
తాజావార్తలు
-
Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
-
Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
-
Cancer Awareness: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే అది క్యాన్సర్ కావచ్చు.. చెక్ చేసుకోండి!
-
Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
-
Kavitha New Party Launch: కవిత కొత్త పార్టీ పేరు ప్రకటన.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!