NTV Telugu Site icon

Delhi University: మోడీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు.. నల్లరంగు దుస్తులు ధరించవద్దని ఆదేశాలు

Delhi University

Delhi University

Delhi University: అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటనల సందర్భంగా ఆంక్షలను విధించడం సర్వసాధారణం. అయితే ఆ ఆంక్షలు ట్రాఫిక్‌కు ఇబ్బంది రాకుండా చూడటానికి ఎక్కువగా పెడతారు. కానీ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీలో శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యార్థులు గానీ, ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ కూడా నల్లరంగు దుస్తులు వేసుకోరాదని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. నల్లరంగు దుస్తులు ధరిస్తే ప్రధాని మోడీ పర్యటనకు నిరసన తెలిపినట్టు అవుతుందని అధికారలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.

Read also: SPY Collections: ‘స్పై’ బాలేదనుకుంటూనే బాక్సాఫీసు వద్ద ఈ కలెక్షన్లు ఏంటి సామీ!

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకలకు యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతలో ఎలాంటి లోపం తలెత్తకుండా ఉండేందుకు కొద్ది రోజుల ముందే భద్రతా బలగాలను యూనివర్సిటీలో మోహరించారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే విద్యార్థులకు, అధ్యాపకులకు ఢిల్లీ యూనివర్సిటీ మరియు కాలేజీలు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశాయి. ప్రధాని మోదీ పాల్గొనే శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని, ఉత్సావాల్లో నల్లటి దుస్తులు ధరించరాదని ఆదేశించారు. అలాగే.. ఢిల్లీలోని హిందూ కళాశాల, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాల , జాకీర్ హుస్సేన్ కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా ప్రధాని ఈవెంట్ కు హాజరు కావాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనే విద్యార్థులు తమ ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలని, సమావేశానికి గంటన్నర ముందుగా రావాలని పేర్కొన్నారు. కార్యక్రమానికి హజరయ్యే విద్యార్థులు నల్ల దుస్తులు ధరించకూడదని హిందూ కళాశాల ఉపాధ్యాయుడు-ఇన్‌చార్జ్ మీను శ్రీవాస్తవ నోటీసులో తెలిపారు. హిందూ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ మాత్రం అటువంటి పరిపాలన నోటీసులను జారీ చేయలేదని చెప్పారు. లైవ్ టెలికాస్ట్ గురించి విద్యార్థులకు, అధ్యాపకులందరికీ తాను మెయిల్ చేసాననీ, దానికి హాజరు కావాలని వారిని కోరాననీ, హాజరు తప్పనిసరి కాదని ప్రిన్సిపాల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కళాశాలలో జరిగే లైవ్ వెబ్ టెలికాస్ట్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను యూనివర్సిటీకి అందజేస్తామని చెప్పారు.

Read also: New Shot in Cricket: క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త షాట్.. వికెట్ల వెనకాలకు వెళ్లి బంతిని బాదిన బ్యాటర్‌! ఎవరండీ ఇతడు

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే సమయంలో డీయూలో మూడు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవనాలను ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సెంటర్, అకడమిక్ బ్లాక్ కోసం కేటాయించనున్నారు. వచ్చే రెండేళ్లలో మూడు భవనాలు పూర్తవుతాయి. లోగో బుక్‌తో సహా మూడు కాఫీ టేబుల్ పుస్తకాలను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి విద్యార్థులు అందరూ తప్పకుండా హాజరు కావాలని, నల్లరంగు దుస్తులు ధరించరాదనే నిబంధన విధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.