Bilkis Bano Case: ”బిల్కిస్ బానో” కేసులో దోషుల విడుదలపై సుప్రీంలో సవాల్..
Bilkis Bano Case: 2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్లో చెలరేగిన అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు దుండగులు. ఆ టైంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు . 15ఏళ్లు కారాగారంలోనే ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీరి విడుదలకు గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో.. గోద్రా సబ్ జైలు నుంచి విడుదల చేశారు అధికారులు. అంతేకాదు వీరికి పెద్ద ఎత్తున ఓ సంస్థ స్వాగతాలు పలకడం, మిఠాయిలు పంచుకోవడం కూడా వివాదమైంది. దోషుల విడుదలపై జాతీయస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. బిల్కిస్ సహా ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ తీరుపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని, దోషుల విడుదల ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ దోషులకు రెమిషన్ మంజూరు చేసి.. విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలైంది. మహిళా హక్కుల కార్యకర్తలు ఈ పిటిషన్ వేశారు.
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ అంగీకరించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పొలిట్బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, జర్నలిస్టు రేవతి లాల్, సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసని.. దోషులకు రెమిషన్ మంజూరు వెనక ఉన్న నిబంధనలను మాత్రమే తాము సవాలు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోనియా గాంధీ భేటీ
గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ పాలసీ ప్రకారం బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత ఆగస్టు 19న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15న విడుదల చేసింది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?