UPI Transaction: యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచిన ఆర్బీఐ..
- డిజిటల్ పేమెంట్స్కు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ..
- యూపీఐ లైట్.. వ్యాలెట్ పరిమితుల పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
- యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితులను కూడా పెంచిన ఆర్బీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Transaction: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్.. డిజిటల్ పేమెంట్స్కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే, యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితులను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
* ఇక, ప్రతి లావాదేవీకి యూపీఐ లైట్ పరిమితి ప్రస్తుతం ఉన్న రూ.500 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
* అలాగే, యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొనింది.
* ప్రతి లావాదేవీకి యూపీఐ 123పే లిమిట్ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచేసింది.
Read Also: IPL 2025-DC: అన్క్యాప్డ్ ప్లేయర్కు జాక్పాట్.. ఢిల్లీ రిటైన్ లిస్ట్ ఇదే!
అలాగే, యూపీఐ సేవల ద్వారా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగం పూర్తిగా మారిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచేందుకు.. ప్రోత్సహించడానికి మేం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఆర్బీఐ వెల్లడించింది. ఇక, ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేసేందుకు యూపీఐ లైట్ సేవలను వాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 నుంచి రూ. 1000కి పెంచింది ఆర్బీఐ. అయితే, యూపీఐ లైట్ సేవలు పొందాలనుకుంటే.. దానికోసం యూపీఐ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. తాజాగా, దాని పరిమితిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. యూపీఐ 123పే అనేది స్మార్ట్ ఫోన్ కాకుండా ఫీచర్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు సంబంధించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!