UPI Transaction: యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితులను పెంచిన ఆర్బీఐ..
- డిజిటల్ పేమెంట్స్కు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ..
- యూపీఐ లైట్.. వ్యాలెట్ పరిమితుల పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
- యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితులను కూడా పెంచిన ఆర్బీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Transaction: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్.. డిజిటల్ పేమెంట్స్కు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే, యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితులను కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
* ఇక, ప్రతి లావాదేవీకి యూపీఐ లైట్ పరిమితి ప్రస్తుతం ఉన్న రూ.500 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
* అలాగే, యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొనింది.
* ప్రతి లావాదేవీకి యూపీఐ 123పే లిమిట్ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచేసింది.
Read Also: IPL 2025-DC: అన్క్యాప్డ్ ప్లేయర్కు జాక్పాట్.. ఢిల్లీ రిటైన్ లిస్ట్ ఇదే!
అలాగే, యూపీఐ సేవల ద్వారా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగం పూర్తిగా మారిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచేందుకు.. ప్రోత్సహించడానికి మేం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఆర్బీఐ వెల్లడించింది. ఇక, ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేసేందుకు యూపీఐ లైట్ సేవలను వాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 నుంచి రూ. 1000కి పెంచింది ఆర్బీఐ. అయితే, యూపీఐ లైట్ సేవలు పొందాలనుకుంటే.. దానికోసం యూపీఐ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. తాజాగా, దాని పరిమితిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. యూపీఐ 123పే అనేది స్మార్ట్ ఫోన్ కాకుండా ఫీచర్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు సంబంధించింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?