Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ranya Rao Case Takes A Political Turn

Ranya Rao: పొలిటికల్ టర్న్ తీసుకున్న రన్యారావు కేసు.. భూ కేటాయింపుపై రగడ

Published Date :March 10, 2025 , 12:04 pm
By Suresh Maddala
  • పొలిటికల్ టర్న్ తీసుకున్న రన్యారావు కేసు
  • భూమి కేటాయింపుపై కాంగ్రెస్-బీజేపీ మధ్య రగడ
  • బీజేపీ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ వెల్లడి
Ranya Rao: పొలిటికల్ టర్న్ తీసుకున్న రన్యారావు కేసు.. భూ కేటాయింపుపై రగడ
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావు కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యా రావు సంస్థకు భూమి కేటాయింపుపై అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

గత కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశాన్ని రన్యారావు కేసు కుదిపేస్తోంది. దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ నటి రన్యారావు డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆమె ఇంట్లో సోదాలు చేయగా… కోట్ల విలువైన ఆభరణాలతో పాటు భారీగా నగదు లభ్యమైంది. అప్పటి నుంచి ఈ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.

ఇది కూడా చదవండి: Varalaxmi : డబ్బు కోసం రోడ్డు మీద డ్యాన్స్ చేశా..

తాజాగా ఆమెకు సంబంధించిన సంస్థకు భూకేటాయింపు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ చేసింది. బీజేపీ హయాంలోనే ఆమె సంస్థకు భూకేటాయింపు జరిగినట్లుగా ఆధారాలతో బయటపెట్టింది. 2023, మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఆమెకు బీజేపీ పాలనలో భూకేటాయింపు జరిగినట్లు తెలిపింది.

2023, జనవరిలో రన్యారావు సంస్థకు భూకేటాయింపు జరిగింది. కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు తుమకూరు జిల్లాలో రన్యా రావుతో సంబంధం ఉన్న ఒక సంస్థకు భూమిని కేటాయించినట్లు అంగీకరించింది. అయితే ఈ భూకేటాయింపు బీజేపీ పాలనలో జరిగిందని స్పష్టం చేసింది. రూ.138 కోట్లతో ఉక్కు తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు రన్యారావు ప్లాన్ చేసింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం 12 ఎకరాల ప్రారిశ్రామిక భూమిని రన్యారావు పొందినట్లుగా బోర్డు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Buddha Venkanna: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించిన బుద్దా వెంకన్న.. ఆసక్తికర వ్యాఖ్యలు

మధ్యతరహా మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 22, 2023 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌తో పాటు.. రన్యా రావు సంస్థ క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు. తుమకూరు జిల్లాలోని సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 160 ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ తెలిపినట్లుగా చెప్పారు.

రన్యారావు తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో దొరకడంపై గుండె పగిలినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను అక్రమంగా తరలించినందుకు రన్యారావును అరెస్టు చేశారు. తాజాగా ఈ అంశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బెంగళూరులోని ఆమె నివాసంలో సోదాలు చేయగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు లభించాయని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • karnataka
  • L and case
  • MB Patil

తాజావార్తలు

  • SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బ తీసిన మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

  • Smartphone Price Hike: మొబైల్ కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ఈ కంపెనీల ఫోన్ల ధరలు.. ఎంతంటే?

  • Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions