BJP: విధేయతకు పట్టం.. ఆఫీస్ ప్యూన్కు టికెట్ ఇచ్చిన బీజేపీ..
- మరోసారి నిరూపించుకున్న బీజేపీ..
- విధేయత, సామాన్య కార్యకర్తలకు ప్రాధాన్యం..
- పార్టీ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసిన వ్యక్తికి బీజేపీ టికెట్..
BJP: విధేయతకు, సామాన్య కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ మరోసారి నిరూపించింది. 28 ఏళ్ల పాటు బీజేపీ ఆఫీస్లో ప్యూన్గా పనిచేసిన వ్యక్తికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. గుజరాత్లోని మెహసానా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మెహసానా జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్యూన్గా పనిచేస్తున్న అంకితభావం గల ఉద్యోగి రమేష్ భిల్కు టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
రమేష్ భిల్ శనివారం అధికారికంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన 13వ వార్డుకు పార్టీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా మారారు. 10వ తరగతి వరకు చదువుకున్న రమేష్, 28 ఏళ్లుగా పార్టీ కార్యాలయంలో పనిచేయడం, అక్కడికి వచ్చే సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు టీ, నీరు అందిస్తూ ఉన్నారు. ఆయనకు ఉన్న విధేయత, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఆయనకున్న పరిచయం కారణంగా పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఇప్పటి వరకు నా పార్టీ కార్యలయం కోసం పనిచేశానని, ఇప్పటి నుంచి తన వార్డ్ ప్రజల బాగోగుల కోసం పనిచేస్తానని రమేష్ భిల్ చెప్పారు.
తాజావార్తలు
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!