Ayodhya: అయోధ్య రామ మందిరం రెడీ.. దర్శనాలు ఎప్పటి నుంచి అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మందిర నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. డిసెంబర్ పూర్తి అయ్యే నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులను శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఓ శుభవార్త వెలువడింది. అయోధ్య రామమందిరం లోని రాముని దర్శనం 2024 జనవరి నుండి మొదలవుతుంది. భక్తుల కోసం వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నుండి 24వ తేదీ మధ్యన రాములవారి విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఆలయ అధ్యక్షుల సమాచారం ప్రకారం 2024 జనవరి 22 వ తేదీన విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. కాగా విగ్రహ ప్రతిష్ట వేడుకలు 2024 జనవరి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. జనవరి 22, మృగశిర నక్షత్రం రాములవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయంగా పరిగణించబడింది.
Read also:Sponge Bombs: హమాస్ సొరంగాల్లో స్పాంజ్ బాంబులు.. భారీ మాస్టర్ ప్లాన్
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ అతిధిగా విచ్చేయనున్నారు. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసార మాధ్యమాల ద్వారా టెలికాస్ట్ చేయనున్నారు. కాగా విగ్రహ ప్రతిష్ట పూర్తయిన రెండు రోజుల తర్వాత నుండి భక్తులకు దర్శనం అనుమతించనున్నారు. ప్రస్తుతం రామాలయం మొదటి దశ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. దీనితో ఆలయం దాని రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం చాలా వరకు పనులు చివరి దశలో ఉన్నాయి. 2024 జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం దాదాపు ఖాయమని ఆలయ అధ్యక్షులు తెలిపారు. కాగా మందిర నిర్మాణం పనులు రెండు దశలుగా ఉన్నాయి. మొదటి దశలో దాదాపు 2.6 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ను సిద్ధం చేయనున్నారు. కాగా ఆలయ గర్భగుడి నుండి ఇది మొదలవుతుంది. ఇందులో 5 మండపాలు ఉంటాయి. ఇక్కడ 160 పిల్లర్లు ఏర్పాటు చేసారు. వాటిపై వివిధ రాకాల శిల్పాలు దర్శనమిస్తాయి.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!