Sudha Murty: హిందీ వివాదంపై సుధా మూర్తి కీలక వ్యాఖ్యలు
- హిందీ వివాదంపై సుధా మూర్తి కీలక వ్యాఖ్యలు
- ఒక వ్యక్తి బహుళ భాషలు నేర్చుకుంటే తప్పేంటి? అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తమిళనాడులో హిందీ వివాదం నడుస్తోంది. కేంద్రం బలవంతంగా తమిళనాడుపై హిందీ రుద్దుతోందని డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ ప్రారంభమైన దగ్గర నుంచి డీఎంకే సభ్యులు… ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు తమిళనాడులో త్రిభాషా ఉద్యమాన్ని బీజేపీ ప్రారంభించింది. ఇలా హిందీ వివాదం జాతీయ స్థాయిలో ఉద్రిక్తంగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Indian Embassy: అమెరికాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
తాజాగా ఇదే అంశంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి స్పందించారు. ఒక వ్యక్తి బహుళ భాషలు నేర్చుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవచ్చన్నారు. అంతెందుకు తనకు 7-8 భాషలు తెలుసు అని సుధా మూర్తి చెప్పుకొచ్చారు. ఈ మేరకు పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా విధానం కరెక్టేనని ఆమె చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: USA-India Tariffs: అమెరికా ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన వైట్ హౌస్
ఇక విద్యాశాఖ పనితీరు కూడా మెరుగుపడాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ ఉండాలని తెలిపారు. ప్రతి మూడేళ్లకోసారి వారికి కూడా టెస్టులు నిర్వహించి.. వారి యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించాలని చెప్పారు. లేదంటే ఉపాధ్యాయులు మెరుగుపడరని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పనితీరు బాగుంటేనే స్టూడెంట్ భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జీవితంలో తల్లి ప్రేమ తప్ప ఏదీ ఉచిత కాదని.. మంచి ఉపాధ్యాయుడు కావాలంటే వారికి మూడేళ్లకోసారి శిక్షణ ఇచ్చి పరీక్షలు పెట్టాల్సిందేనని సుధామూర్తి చెప్పుకొచ్చారు.
#WATCH | Delhi | Rajya Sabha MP Sudha Murthy says, "Holi is the festival of colours, Happy Holi to all the people of the country."
On the three-language policy in NEP, she says, "I have always believed that one can learn multiple languages and I myself know 7-8 languages…" pic.twitter.com/taV1Mi8bH5
— ANI (@ANI) March 12, 2025
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!