Rajinikanth: అధికారమార్పిడికి గుర్తుగా ఉపయోగించే చారిత్రత్మక రాజదండం ‘సెంగోల్’ను కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ పోడియం వద్ద ప్రతిష్టించబోతున్నారు. తమిళ సంప్రాదాయానికి చెందిన ఈ సెంగోల్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీటవేసింది. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ రోజు తమిళ ఆధీనం పూజారులు సెంగోల్ ను ప్రధాని నరేంద్రమోడీకి వేదమంత్రాల ఆశిర్వచనంతో అందచేశారు. చెన్నై నుంచి ఈ రోజ ఢిల్లీకి బయలుదేరిని పూజారులు ప్రధాని నివాసంలో సెంగోల్ ను అందించారు.
Read Also: Sengol: రాజదండాన్ని ప్రధాని మోడీకి అందించిన ఆధీనం పూజారులు
ఇదిలా ఉంటే తమిళ సాంప్రదాయ చిహ్నానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. తమిళ శక్తి యొక్క సాంప్రదాయ చిహ్నం- రాజదండం(సెంగోల్), భారతదేశ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రకాశిస్తుంది. తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్రమోడీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రజినీ కాంత్ ట్వీట్ చేశారు.
రేపు ఉదయం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, జేడీయూ వంటి 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతితో ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ బహిష్కరణకు పిలుపునిచ్చాయి. మరో 25 పార్టీలు మాత్రం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని ప్రకటించాయి.
"The traditional symbol of Tamil power – the sceptre (#Sengol) – will shine in India's #NewParliamentBuilding. My sincere thanks to Prime Minister Narendra Modi who made Tamilians proud," tweets actor Rajinikanth. pic.twitter.com/yF301G0PB6
— ANI (@ANI) May 27, 2023