Rajasthan: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఉదయ్ పూర్ హత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో జరిగిన హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడం, హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది వైరల్ కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయ్ పూర్ లో మల్దాస్ ప్రాంతంలో బిజీగా ఉండే మార్కెట్ లో తన షాప్ లో పని చేసుకుంటున్న కన్హయ్య కుమార్ ను రియాజ్ అక్తర్ పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో పాటు శిరచ్ఛేదానికి ప్రయత్నించారు. మరో నిందితుడు గౌస్ మహ్మద్ ఈ హత్యను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఘటనకు పాల్పడిన నిందితులను గంటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ హత్యతో రాజస్తాన్ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజస్తాన్ లో మంగళవారం ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. నెల రోజుల పాటు ఈ సెక్షన్ ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా పోలీసులకు సెలవులు రద్దు చేశారు. అన్ని జిల్లాల్లో , సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు పోలీసులు.
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
ఇదిలా ఉంటే ఘటనను జమియత్ ఉలామా- ఇ- హింద్ సంస్థ ఉదయ్ పూర్ హత్యను ఖండించింది. హత్య ఇస్లాం, దేశ చట్టాలకు వ్యతిరేఖమని సంస్థ కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మీ అన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిని సమర్థించలేమని, ఇది ఇస్లాం మతానికి విరుద్ధమని పేర్కొన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని.. దేశంలో శాంతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి