Rajasthan: ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం.. ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం.. వెలుగులోకి ఇలా..!
- రాజస్థాన్లో ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం
- ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరతాయని పెద్దలు అంటుంటారు. ఇది సామెతే అయినప్పటికీ.. ఇది అక్షరాల నిజం కూడా. అచ్చం అదే మాదిరిగా రాజస్థాన్కు చెందిన ఒక అధికారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
Also Read
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
రాజ్కాంప్ ఇన్ఫో సర్వీసెస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ప్రద్యుమాన్ దీక్షిత్ పనిచేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ టెండర్లను దక్కించుకున్నాయి. ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. అయితే ప్రద్యుమాన్ దీక్షిత్ ఇదే అవకాశంగా ఘరానా మోసానికి తెగబడ్డాడు. రెండు కంపెనీల్లో భార్య పూనమ్ దీక్షిత్ పని చేస్తున్నట్లుగా రూ.37.54 లక్షల జీతం పుచ్చుకుంది. దాదాపుగా రెండేళ్లుగా ఏ ఆఫీసుకూ వెళ్లకుండానే పూనమ్ దీక్షిత్ జీతం అందుకుంది. మొత్తానికి పాపం పడి యవ్వారం బయటపడింది.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
రాజస్థాన్ హైకోర్టులో ఒక ఫిర్యాదుదారుడు పిటిషన్ దాఖలు చేయడంతో బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ (ACB) ఈ ఏడాది జూలై 3న ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో అక్రమంగా జీతం అందుకుంటున్నట్లు తేలింది. ప్రైవేటు కంపెనీలకు టెండర్లు దక్కేలా చేసినందుకు ప్రతిఫలంగా ప్రద్యుమాన్ తన భార్యను నియమించుకోవాలని.. నెలవారీ జీతం అందించాలని కోరాడు. దీంతో ఆ రెండు కంపెనీలు.. ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీలు రూ.37.54 లక్షల జీతం అందించాయి. జనవరి 2019-సెప్టెంబర్ 2020 మధ్య పూనమ్ దీక్షిత్.. ఐదు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ డబ్బును బదిలీ చేశాయని దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు రూ. 37,54,405 జీతంగా పంపించాయి. ఈ రెండేళ్ల కాలంలో పూనమ్ దీక్షిత్ ఎప్పుడూ కార్యాలయాలను సందర్శించలేదని తేలింది. ప్రద్యుమన్ దీక్షిత్ స్వయంగా భార్య నకిలీ హాజరు నివేదికలను ఆమోదించాడు. ‘ఫ్రీలాన్సింగ్’ ముసుగులో ఈ దందా అంతా నిర్వహించినట్లు బయటపడింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Cyclone Montha: ఈ రాత్రే తుఫాన్గా మారనున్న వాయుగుండం!
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!