Rajasthan: ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం.. ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం.. వెలుగులోకి ఇలా..!
- రాజస్థాన్లో ఓ ప్రభుత్వాధికారి ఘరానా మోసం
- ఏ జాబ్ చేయకుండానే భార్యకు రూ.37.54 లక్షల జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వడ్డించే వాడు మనవాడయితే.. బంతి చివర్లో కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరతాయని పెద్దలు అంటుంటారు. ఇది సామెతే అయినప్పటికీ.. ఇది అక్షరాల నిజం కూడా. అచ్చం అదే మాదిరిగా రాజస్థాన్కు చెందిన ఒక అధికారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
రాజ్కాంప్ ఇన్ఫో సర్వీసెస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ప్రద్యుమాన్ దీక్షిత్ పనిచేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వ టెండర్లను దక్కించుకున్నాయి. ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. అయితే ప్రద్యుమాన్ దీక్షిత్ ఇదే అవకాశంగా ఘరానా మోసానికి తెగబడ్డాడు. రెండు కంపెనీల్లో భార్య పూనమ్ దీక్షిత్ పని చేస్తున్నట్లుగా రూ.37.54 లక్షల జీతం పుచ్చుకుంది. దాదాపుగా రెండేళ్లుగా ఏ ఆఫీసుకూ వెళ్లకుండానే పూనమ్ దీక్షిత్ జీతం అందుకుంది. మొత్తానికి పాపం పడి యవ్వారం బయటపడింది.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
రాజస్థాన్ హైకోర్టులో ఒక ఫిర్యాదుదారుడు పిటిషన్ దాఖలు చేయడంతో బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ (ACB) ఈ ఏడాది జూలై 3న ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో అక్రమంగా జీతం అందుకుంటున్నట్లు తేలింది. ప్రైవేటు కంపెనీలకు టెండర్లు దక్కేలా చేసినందుకు ప్రతిఫలంగా ప్రద్యుమాన్ తన భార్యను నియమించుకోవాలని.. నెలవారీ జీతం అందించాలని కోరాడు. దీంతో ఆ రెండు కంపెనీలు.. ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ కంపెనీలు రూ.37.54 లక్షల జీతం అందించాయి. జనవరి 2019-సెప్టెంబర్ 2020 మధ్య పూనమ్ దీక్షిత్.. ఐదు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఓరియన్ప్రో సొల్యూషన్స్, ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ డబ్బును బదిలీ చేశాయని దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు రూ. 37,54,405 జీతంగా పంపించాయి. ఈ రెండేళ్ల కాలంలో పూనమ్ దీక్షిత్ ఎప్పుడూ కార్యాలయాలను సందర్శించలేదని తేలింది. ప్రద్యుమన్ దీక్షిత్ స్వయంగా భార్య నకిలీ హాజరు నివేదికలను ఆమోదించాడు. ‘ఫ్రీలాన్సింగ్’ ముసుగులో ఈ దందా అంతా నిర్వహించినట్లు బయటపడింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Cyclone Montha: ఈ రాత్రే తుఫాన్గా మారనున్న వాయుగుండం!
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?