Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
- మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
- ఎక్స్లో ఫొటోలు పంచుకున్న జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జైశంకర్-రూబియో చర్చించారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Kanpur: కాన్పూర్లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత
Also Read
ఇదిలా ఉంటే అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు జీన్ షాహీన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం, ఇంధన భద్రత, చమురు, గ్యాస్ వాణిజ్యం గురించి చర్చించారు. ఇరు దేశాలకు సంబంధించిన కీలక చర్చలు జరిగినట్లుగా వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్లో తెలిపారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని భారత రాయబారి క్వాత్రా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
మరోవైపు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు బాగా పురోగమిస్తున్నాయని, రెండు వైపులా చాలా అంశాలపై కమ్యూనికేట్ అవుతున్నాయని, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం ఆసన్నమైందని సూచించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మనం చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. భారత్పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ వేశారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇలా మొత్తంగా భారత్పై 50 శాతం సుంకం పడింది. అయితే రష్యాతో సంబంధాలు తెంచుకుంటే సుంకాలు తగ్గిస్తామని అమెరికా అంటోంది. ప్రస్తుతం రష్యా దగ్గర చమురు కొనుగోలు తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు మలేషియా వేదికగా జైశంకర్-రూబియో మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Glad to meet @SecRubio this morning in Kuala Lumpur.
Appreciated the discussion on our bilateral ties as well as regional and global issues.
🇮🇳 🇺🇸 pic.twitter.com/mlrqoyZypB
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 27, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!