Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
- మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
- ఎక్స్లో ఫొటోలు పంచుకున్న జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జైశంకర్-రూబియో చర్చించారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Kanpur: కాన్పూర్లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత
Also Read
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
ఇదిలా ఉంటే అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు జీన్ షాహీన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం, ఇంధన భద్రత, చమురు, గ్యాస్ వాణిజ్యం గురించి చర్చించారు. ఇరు దేశాలకు సంబంధించిన కీలక చర్చలు జరిగినట్లుగా వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్లో తెలిపారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని భారత రాయబారి క్వాత్రా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
మరోవైపు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు బాగా పురోగమిస్తున్నాయని, రెండు వైపులా చాలా అంశాలపై కమ్యూనికేట్ అవుతున్నాయని, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం ఆసన్నమైందని సూచించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మనం చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. భారత్పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ వేశారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇలా మొత్తంగా భారత్పై 50 శాతం సుంకం పడింది. అయితే రష్యాతో సంబంధాలు తెంచుకుంటే సుంకాలు తగ్గిస్తామని అమెరికా అంటోంది. ప్రస్తుతం రష్యా దగ్గర చమురు కొనుగోలు తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు మలేషియా వేదికగా జైశంకర్-రూబియో మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Glad to meet @SecRubio this morning in Kuala Lumpur.
Appreciated the discussion on our bilateral ties as well as regional and global issues.
🇮🇳 🇺🇸 pic.twitter.com/mlrqoyZypB
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 27, 2025
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!