Jaishankar-Rubio: మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
- మలేషియా వేదికగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు
- ఎక్స్లో ఫొటోలు పంచుకున్న జైశంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలేషియా వేదికగా ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. మోడీ తరపున భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మలేషియాకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను జైశంకర్ కలిశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జైశంకర్-రూబియో చర్చించారు. ఈ మేరకు జైశంకర్ ఎక్స్లో కీలక పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Kanpur: కాన్పూర్లో దారుణం.. లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికివేత
Also Read
ఇదిలా ఉంటే అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు జీన్ షాహీన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం, ఇంధన భద్రత, చమురు, గ్యాస్ వాణిజ్యం గురించి చర్చించారు. ఇరు దేశాలకు సంబంధించిన కీలక చర్చలు జరిగినట్లుగా వినయ్ మోహన్ క్వాత్రా ఎక్స్లో తెలిపారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ వివాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని భారత రాయబారి క్వాత్రా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Doctor Suicide Case: వైద్యురాలి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
మరోవైపు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు బాగా పురోగమిస్తున్నాయని, రెండు వైపులా చాలా అంశాలపై కమ్యూనికేట్ అవుతున్నాయని, పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందం ఆసన్నమైందని సూచించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మనం చాలా దగ్గరగా ఉన్నట్లు భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. భారత్పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ వేశారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. ఇలా మొత్తంగా భారత్పై 50 శాతం సుంకం పడింది. అయితే రష్యాతో సంబంధాలు తెంచుకుంటే సుంకాలు తగ్గిస్తామని అమెరికా అంటోంది. ప్రస్తుతం రష్యా దగ్గర చమురు కొనుగోలు తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇంకోవైపు మలేషియా వేదికగా జైశంకర్-రూబియో మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Glad to meet @SecRubio this morning in Kuala Lumpur.
Appreciated the discussion on our bilateral ties as well as regional and global issues.
🇮🇳 🇺🇸 pic.twitter.com/mlrqoyZypB
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 27, 2025
తాజావార్తలు
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!