Rajasthan: సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు.. తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
- సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు
- తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఈ తీర్పు చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Gold Import Tariff: ట్రంప్ గుడ్ న్యూస్.. బంగారంపై ఎటువంటి సుంకం ఉండదు.. ధరలు మరింత తగ్గే ఛాన్స్!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
తాజాగా సుప్రీంకోర్టు బాటలో రాజస్థాన్ హైకోర్టు కూడా చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్నట్టుగానే హైకోర్టు సీరియస్ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కలను తక్షణమే తీసివేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ కుల్దీప్ మాథుర్, జస్టిస్ రవి చిరానియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
వీధి కుక్కలు, ఇతర జంతువులు నగర రోడ్ల నుంచి తొలగించాలని మున్సిపల్ సంస్థలకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. శారీరిక హాని కలగకుండా షెల్టర్టకు తరలించాలని కోర్టు ఆదేశించింది. వీధి కుక్కలు, జంతువుల కారణంగా మనుషులు ప్రాణాలు పోతున్నాయని.. మనుషుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఎవరైనా తొలగింపు కార్యక్రమాలు అడ్డుకుంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
‘‘మున్సిపాలిటీల ఉద్యోగులు… రోడ్లు/కాలనీలు/ప్రజా మార్గాల నుంచి వీధి జంతువులను తొలగించడంలో తమ విధులను నిర్వర్తించకుండా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం అడ్డుకుంటే..మున్సిపల్ అధికారులు/ఉద్యోగులు సంబంధిత మున్సిపల్ చట్టాల ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించకుండా ఆటంకం కలిగించినందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చు.’’ అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.
ఢిల్లీ వీధుల నుంచి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర ధర్నా చేపట్టారు. ఇక ఈ తీర్పును కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ కూడా తప్పుపట్టారు. ఒక వ్యక్తి కోపంతో తీసుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనిపై జంతు ప్రేమికులు ఏమంటారో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?