Rajasthan: సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు.. తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
- సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు
- తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఈ తీర్పు చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Gold Import Tariff: ట్రంప్ గుడ్ న్యూస్.. బంగారంపై ఎటువంటి సుంకం ఉండదు.. ధరలు మరింత తగ్గే ఛాన్స్!
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
తాజాగా సుప్రీంకోర్టు బాటలో రాజస్థాన్ హైకోర్టు కూడా చేరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్నట్టుగానే హైకోర్టు సీరియస్ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కలను తక్షణమే తీసివేయాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ కుల్దీప్ మాథుర్, జస్టిస్ రవి చిరానియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
వీధి కుక్కలు, ఇతర జంతువులు నగర రోడ్ల నుంచి తొలగించాలని మున్సిపల్ సంస్థలకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించింది. శారీరిక హాని కలగకుండా షెల్టర్టకు తరలించాలని కోర్టు ఆదేశించింది. వీధి కుక్కలు, జంతువుల కారణంగా మనుషులు ప్రాణాలు పోతున్నాయని.. మనుషుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఎవరైనా తొలగింపు కార్యక్రమాలు అడ్డుకుంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
‘‘మున్సిపాలిటీల ఉద్యోగులు… రోడ్లు/కాలనీలు/ప్రజా మార్గాల నుంచి వీధి జంతువులను తొలగించడంలో తమ విధులను నిర్వర్తించకుండా వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం అడ్డుకుంటే..మున్సిపల్ అధికారులు/ఉద్యోగులు సంబంధిత మున్సిపల్ చట్టాల ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించకుండా ఆటంకం కలిగించినందుకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయొచ్చు.’’ అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.
ఢిల్లీ వీధుల నుంచి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకించారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర ధర్నా చేపట్టారు. ఇక ఈ తీర్పును కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ కూడా తప్పుపట్టారు. ఒక వ్యక్తి కోపంతో తీసుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనిపై జంతు ప్రేమికులు ఏమంటారో చూడాలి.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!