వీధి కుక్కల బెడదపై మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఈ తీర్పు చట్ట విరుద్ధం అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనలు చేపట్టారు.