Raj Thackeray: మోదీజీ యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురండి, ఔరంగాబాద్ పేరు మార్చండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా పుణేలో మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు రాజ్ ఠాక్రే. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు.
తాజాగా ఆదివారం పూణేలోని గణేష్ కళా క్రీడా మంచ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు రాజ్ ఠాక్రే. ఈ ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చాలని ప్రధానిని కోరారు. జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు రాజ్ ఠాక్రే. రెండు రోజుల క్రితం నా అయోధ్య పర్యటనను వాయిదా వేస్తూ ట్వీట్ చేశానని… ప్రతీ ఒక్కరూ తమ స్పందనను తెలియజేయడానికే ఉద్దేశపూర్వకంగా ప్రకటన ఇచ్చానని.. నా అయోధ్య టూర్ ను వ్యతిరేఖిస్తున్న వారు నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. నేను ఆ ట్రాప్ లో పడనని రాజ్ ఠాక్రే అన్నారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని.. లేకపోతే హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని నేను చెప్పిన తర్వాత నవీనీత్ రాణా దంపతులు హనుమాన్ చాలీసా పఠిస్తామని అన్నారని… సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ఏమైనా మసీదా..? అంటూ రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. శివసైనికులు, రాణా దంపతులకు మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసని రాజ్ ఠాక్రే అన్నారు. శివసేన ప్రభుత్వంపై రాజ్ ఠాక్రే కీలక విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీని పెద్ద పార్టీగా చేశారని మండిపడ్డారు.
కాగా… రాజ్ ఠాక్రే ర్యాలీకి అనుమతి కోసం పుణే పోలీసులు 13 ఆంక్షలు విధించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు ఎటువంటి మారణాయుధాలు తీసుకురావద్దని, లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రత సుప్రీం కోర్ట్ ఆర్డర్ కు లోబడి ఉండాలని నిబంధనలు విధించింది.
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!