Rahul Gandhi: స్పీకర్కు రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేఖ
- సభలో ప్రసంగాన్ని అడ్డుకోవడంపై అభ్యంతరం
- స్పీకర్ బాధ్యతల్ని గుర్తుచేస్తూ లేఖలో ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంపై దుమారం రేపుతోంది. రాహుల్గాంధీ ప్రసంగాన్ని స్పీకర్, అధికార సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పాత్రను, బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేశారు. స్పీకర్కు తన నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Gaddafi: లిబియా నియంత గడాఫీ కుమారుడు హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
- Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
‘‘దేశ భద్రతపై లోకసభలో మాట్లాడేందుకు తనకున్న హక్కును అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఉద్రిక్తతలను లోకసభలో గత సోమవారం ప్రస్తావిస్తుండగా తాను ఉటంకించే ‘‘మ్యాగజైన్’’ లోని అంశాల ప్రామాణికత, విశ్వసనీయతకు బాధ్యత వహించాలని స్పీకర్ ఆదేశించారు. లోక్సభ సంప్రదాయాలకు లోబడి.. గతంలో పలు సందర్భాల్లో స్పీకర్లు ఇచ్చిన ‘‘రూలింగ్”లకు అనుగుణంగా తాను ప్రస్తావించే అంశాలకు బాధ్యత వహించాలన్న నిబంధనను పాటించాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘స్పీకర్ అనుమతితో (పుస్తకం, మ్యాగజైన్), పత్రంలోని అంశాలను సభ్యుడు ప్రస్తావించిన తర్వాత వాటికి ప్రతి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంతటితో స్పీకర్ పాత్ర పరిసమాప్తమౌతుంది. లోక్సభలో నన్ను మాట్లాడకుండా అడ్డుకోవడం సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రతిపక్ష నేతగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించకుండా నన్ను కావాలనే అడ్డుకోవడం తీవ్ర అందోళనకరమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని పరిస్థితికి దారి తీసింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రోద్బలం మేరకు ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా నిలువరించడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటిది ఈ పరిస్థితి. అందుకు నా నిరసనను వ్యక్తం చేస్తున్నాను. నిష్పక్షపాత చట్టసభ పరిరక్షకులుగా.. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేస్తూ ప్రతిపక్షాలతో సహా సభ్యులందరి హక్కులను కాపాడండి.’’ అంటూ లేఖలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Iran-US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇరాన్ డ్రోన్ను కూల్చేసిన అమెరికా
తాజావార్తలు
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!