Rahul Gandhi: స్పీకర్కు రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేఖ
- సభలో ప్రసంగాన్ని అడ్డుకోవడంపై అభ్యంతరం
- స్పీకర్ బాధ్యతల్ని గుర్తుచేస్తూ లేఖలో ప్రస్తావన
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంపై దుమారం రేపుతోంది. రాహుల్గాంధీ ప్రసంగాన్ని స్పీకర్, అధికార సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పాత్రను, బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేశారు. స్పీకర్కు తన నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Gaddafi: లిబియా నియంత గడాఫీ కుమారుడు హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
‘‘దేశ భద్రతపై లోకసభలో మాట్లాడేందుకు తనకున్న హక్కును అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఉద్రిక్తతలను లోకసభలో గత సోమవారం ప్రస్తావిస్తుండగా తాను ఉటంకించే ‘‘మ్యాగజైన్’’ లోని అంశాల ప్రామాణికత, విశ్వసనీయతకు బాధ్యత వహించాలని స్పీకర్ ఆదేశించారు. లోక్సభ సంప్రదాయాలకు లోబడి.. గతంలో పలు సందర్భాల్లో స్పీకర్లు ఇచ్చిన ‘‘రూలింగ్”లకు అనుగుణంగా తాను ప్రస్తావించే అంశాలకు బాధ్యత వహించాలన్న నిబంధనను పాటించాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘స్పీకర్ అనుమతితో (పుస్తకం, మ్యాగజైన్), పత్రంలోని అంశాలను సభ్యుడు ప్రస్తావించిన తర్వాత వాటికి ప్రతి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంతటితో స్పీకర్ పాత్ర పరిసమాప్తమౌతుంది. లోక్సభలో నన్ను మాట్లాడకుండా అడ్డుకోవడం సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రతిపక్ష నేతగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించకుండా నన్ను కావాలనే అడ్డుకోవడం తీవ్ర అందోళనకరమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని పరిస్థితికి దారి తీసింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రోద్బలం మేరకు ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా నిలువరించడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటిది ఈ పరిస్థితి. అందుకు నా నిరసనను వ్యక్తం చేస్తున్నాను. నిష్పక్షపాత చట్టసభ పరిరక్షకులుగా.. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేస్తూ ప్రతిపక్షాలతో సహా సభ్యులందరి హక్కులను కాపాడండి.’’ అంటూ లేఖలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Iran-US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇరాన్ డ్రోన్ను కూల్చేసిన అమెరికా
తాజావార్తలు
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?