Rahul Gandhi: స్పీకర్కు రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేఖ
- సభలో ప్రసంగాన్ని అడ్డుకోవడంపై అభ్యంతరం
- స్పీకర్ బాధ్యతల్ని గుర్తుచేస్తూ లేఖలో ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంపై దుమారం రేపుతోంది. రాహుల్గాంధీ ప్రసంగాన్ని స్పీకర్, అధికార సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పాత్రను, బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేశారు. స్పీకర్కు తన నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Gaddafi: లిబియా నియంత గడాఫీ కుమారుడు హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
‘‘దేశ భద్రతపై లోకసభలో మాట్లాడేందుకు తనకున్న హక్కును అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఉద్రిక్తతలను లోకసభలో గత సోమవారం ప్రస్తావిస్తుండగా తాను ఉటంకించే ‘‘మ్యాగజైన్’’ లోని అంశాల ప్రామాణికత, విశ్వసనీయతకు బాధ్యత వహించాలని స్పీకర్ ఆదేశించారు. లోక్సభ సంప్రదాయాలకు లోబడి.. గతంలో పలు సందర్భాల్లో స్పీకర్లు ఇచ్చిన ‘‘రూలింగ్”లకు అనుగుణంగా తాను ప్రస్తావించే అంశాలకు బాధ్యత వహించాలన్న నిబంధనను పాటించాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘స్పీకర్ అనుమతితో (పుస్తకం, మ్యాగజైన్), పత్రంలోని అంశాలను సభ్యుడు ప్రస్తావించిన తర్వాత వాటికి ప్రతి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంతటితో స్పీకర్ పాత్ర పరిసమాప్తమౌతుంది. లోక్సభలో నన్ను మాట్లాడకుండా అడ్డుకోవడం సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రతిపక్ష నేతగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించకుండా నన్ను కావాలనే అడ్డుకోవడం తీవ్ర అందోళనకరమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని పరిస్థితికి దారి తీసింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రోద్బలం మేరకు ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా నిలువరించడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటిది ఈ పరిస్థితి. అందుకు నా నిరసనను వ్యక్తం చేస్తున్నాను. నిష్పక్షపాత చట్టసభ పరిరక్షకులుగా.. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేస్తూ ప్రతిపక్షాలతో సహా సభ్యులందరి హక్కులను కాపాడండి.’’ అంటూ లేఖలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Iran-US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇరాన్ డ్రోన్ను కూల్చేసిన అమెరికా
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..