Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Will Become Pm Said Seer At Karnataka Mutt

Rahul Gandhi: “రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు”.. మురుగరాజేంద్ర మఠంలో ఓ స్వామీజీ!

Published Date :August 3, 2022 , 2:29 pm
By Mahesh Jakki
Rahul Gandhi: “రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు”.. మురుగరాజేంద్ర మఠంలో ఓ స్వామీజీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi: కర్ణాటకలోని చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని పలువురితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడి స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్వామీజీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అనగానే.. వెంటనే మఠాధిపతి కలుగుజేసుకుని దానిని సరిజేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ స్వామీజీలను కలుస్తున్నపుడు వారిలో ఒకరైన హవేరి హోసముత్ స్వామి “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు” అని చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావు ఆ వ్యాఖ్యలను సవరిస్తూ “మా మఠాన్ని ఎవరు సందర్శించినా, వారు ధన్యులు” అని జోడించారు.

కర్ణాటక జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న లింగాయత్‌లు సాంప్రదాయకంగా బీజేపీ ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా నేతలు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటినుంచే పార్టీలో ఐక్యతను కూడా పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఏడాది మేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠంలో రాహుల్ గాంధీ, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ పర్యటించారు.

2013 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. 2018 ఎన్నికల తర్వాత జనతాదళ్ (సెక్యులర్) భాగస్వామ్యంతో కొంతకాలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన అనంతరం ఒక సంవత్సరంలోనే కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ మళ్లీ రాష్ట్రంలో పాలనలోకి వచ్చింది.బీజేపీ మొదట్లో లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రి చేసింది. గతేడాది ఆయన స్థానంలో అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైని నియమించారు.

Raj Gopal Reddy: రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి సవాల్.. మునుగోడులో గెలిచేది నేనే..!

అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పోరాడుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. మంగళవారం రాత్రి జరిగిన రాష్ట్ర యూనిట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించారు, అక్కడ నాయకులు కలిసి పని చేయాలని, బహిరంగంగా మాట్లాడవద్దని ఆయన కోరారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. నాయకత్వ సమస్య అసలే లేదు. వ్యక్తిగత అభిప్రాయం కూడా ఆమోదయోగ్యం కాదు. గెలిచిన తర్వాత నాయకుడిని పార్టీ కొత్త ఎమ్మెల్యేలు, హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. ఈ కమిటీ తరచుగా సమావేశమై పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుందని, కర్ణాటక కేంద్రంలో బీజేపీ దుష్టపాలనపై దూకుడుగా, ఐక్యంగా ముందుకు సాగాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అంతర్గత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. తెలిసీ తెలియక అక్కడక్కడా మీడియా ముందు కొన్ని ప్రకటనలు చేస్తుంటారని, ఆ ఉచ్చులో పడవద్దని… పార్టీ నేతలు ఇంటా బయటా భిన్న స్వరాలతో మాట్లాడకూడదని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress leader Rahul Gandhi
  • Karnataka Mutt
  • rahul gandhi
  • rahul gandhi visit lingayat mutt
  • Rahul Gandhi Will Become PM

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions