Rahul Gandhi: అధ్యక్ష ఎన్నిక వద్దు.. జోడో యాత్రే ముద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికంగా మారాయి.. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ కానుండగా.. 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.. ఇక, అక్టోబర్ 17వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది.. అయితే.. తాజా పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఓవైపు రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని.. ఆయన పోటీ చేయాల్సిందేనంటూ పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేస్తున్నాయి… కానీ, గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది జీ 23.. అయితే, ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. భారత్ జోడో యాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన.. పాదయాత్రను మధ్యలో విడిచి వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నమాట..
Read Also: KTR: కజకిస్తాన్ నుంచి కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ సెప్టంబర్ 30 కాగా.. అప్పటికి రాహుల్ గాంధీ యాత్ర కేరళలో ముగిసి కర్ణాటకకు చేరుకోనుంది… కానీ, ఆయన మాత్రం మధ్యలో యాత్రను ఆపేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.. మరోవైపు, అధ్యక్ష పదవి కోసం పార్టీలోని అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశి థరూర్ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీతో శశిథరూర్ సమావేశం కావడం కూడా చర్చగా మారింది. అంతే కాదు, ఈ జాబితాలోకి మరొకరు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక, రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో.. అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేస్తున్నారు..
ఇక, 1998 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ కాలం సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వచ్చారు.. మధ్యలో అంటే.. 2017లో రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించినా.. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నారు రాహుల్.. దీంతో.. మళ్లీ సోనియానే పగ్గాలు తీసుకున్నారు.. సుదీర్ఘ కసరత్తుల తర్వాత అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం అవుతోంది పార్టీ.. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు.. దీంతో, బరిలోకి దిగేది ఎవరు? ఆ అవకాశం ఉందా? వరుసగా కొన్ని రాష్ట్రాల పీసీసీలు.. రాహుల్నే పార్టీ చీఫ్ను చేయాలంటూ తీర్మానాలు చేస్తున్న తరుణంలో.. ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠ నెలకొంది..
తాజావార్తలు
-
Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్తో వచ్చేస్తున్న Neo 11S.!
-
Virat Kohli: కోహ్లీకి కోపం వస్తుంది.. క్రికెట్ బోరింగ్గా మారిపోతుంది.. మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Mrunal Thakur: డీప్ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
ట్రెండింగ్
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!