Congress 1st list: వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ.. తొలి జాబితాలో బఘేల్, శశిథరూర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress 1st list: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఇప్పటికే 195 ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసింది. మరోవైపు ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మొత్తం 10 రాష్ట్రాల్లోని కొన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసిటట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోక్సభ జాబితా 39 మంది అభ్యర్థులతో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలి జాబితాలోనే రాహుల్ గాంధీ, భూపేష్ బఘేల్, కేసీ వేణుగోపాల్, శశిథరూర్ వంటి దిగ్గజ నేతలు ఉంటారని సమాచారం.
Read Also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడి కొత్త వీడియో.. ప్రజల సాయం కోరిన ఎన్ఐఏ..
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
మరోసారి రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తొలిజాబితాలో ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేట్ రాజ్నంద్ గావ్ నుంచి, కేరళ తిరువనంతపురం నుంచి శశిథరూర్ అలప్పుజా నుంచి కేసీ వేణుగోపాల్ పోటీలో ఉండనున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం మరియు లక్షద్వీప్ల అభ్యర్థులు ఉండవచ్చు. ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్పై చర్చ నడుస్తుండటంతో మహారాష్ట్ర, బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలను కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనను హోల్డ్లో పెట్టింది. ఇక యూపీలో ఇప్పటికే అఖిలేష్ యాదవ్తో పొత్తు ఖరారైంది.
రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలను తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా ఇక్కడి నాయకత్వం కోరినప్పటికీ మరోసారి వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సీపీఎం కూడా ఈ సీటుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ తమకు ఈ సీటు వదిలేయాలని కాంగ్రెస్ని కోరుతోంది. కాంగ్రెస్కి చెందిన 11 మంది మాజీ సీఎంలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారని కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!