Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Criticizes Bjp In Adani Case

Rahul GandhI: మోదీ, అదానీ బంధం ఇప్పటిది కాదు.. చాలా పాతది..

Published Date :February 7, 2023 , 3:35 pm
By Venu Goapl Reddy
Rahul GandhI: మోదీ, అదానీ బంధం ఇప్పటిది కాదు.. చాలా పాతది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi criticizes BJP in Adani case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో అదానీ వ్యవహారం, అగ్నివీర్ స్కీమ్ గురించి విమర్శించారు. భారత్ జోడో యాత్ర అనుభవాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వెల్లడించారు. అగ్నివీర్ యోజన సైనికులు నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని, ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ది అని అన్నారు.

ప్రతీ రాష్ట్రంలో అదానీ గురించే చర్చ జరుగుతోందని.. అదానీ ప్రతీ వ్యాపారంలో దూరిపోతాడని, విజయం సాధిస్తాడని, ఆ బిజినెస్ ట్రిక్ ఏమిటో మాకు చెప్పాలని, మేము కూడా అదానీలా కావాలనుకుంటున్నామని ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. 2014 లో 8 బిలియన్ డాలర్ల అదానీ వ్యాపార సామ్రాజ్యం 2022 లో 140 బీలియన్ డాలర్లు సామ్రాజ్యం గా మారిపోయిందన్నారు. అదానీ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించిందని ఆరోపించారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 2014 లో 609 స్థానంలో ఉన్న అదానీ, 2022 లో 2 వ స్థానంలోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు.

Read Also: Virat Kohli: అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ..మరో 64 రన్స్ చేస్తే!

ఈ సమయంలో మోదీ అండగా ఉంటే సాధ్యం కానిదేముందని కాంగ్రెస్ నేతలు కేకలు వేశారు. మోదీ, అదానీల బంధం ఈ రోజుది కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014లో అదానీ అసలు మ్యాజిక్ మొదలైందని అన్నారు. ఎయిర్ పోర్టు అభివృద్ధిలో పూర్వ అనుభవం లేని వారికి ఎయిర్ పోర్టు అభివృద్ధి, నిర్మాణ పనులలో కాంట్రాక్ట్ ఇవ్వరాదని నిబంధన ఉంది..ఆ నిబంధన ను మార్చారు. అదానీ కి ఆరు ఎయుర్ పోర్టులు ఇచ్చారని విమర్శించారు. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జివికే సంస్థ చేస్తుంటే, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అదానీకి అప్పగించారని విమర్శించారు.

వర్ధమాన వ్యాపారులకు, వాణిజ్య సంస్థ లకు ఇదొక నమూనా అని దీనిపై రీసెర్చ్ చేయాలని, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి, వ్యక్తుల వ్యాపార సామ్రాజ్యాలను ఎలా అభివృధ్ది చేయాలో స్పష్టమౌతుందని ఆరోపించారు. రక్షణ రంగంలోకి కూడా అదానీ ప్రవేశించారని.. ఎల్బిట్ కంపెనీతో కలిసి భారత్ లో అదానీ డ్రోన్ంలను తయారు చేస్తారని.. ఈడ్రోన్లను భారత్ త్రివిధ దళాలకు సరఫరా చేస్తారని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ గతంలో డ్రోన్లు తయారీ ఎప్పుడూ చేయలేదని.. ప్రధాని ఇజ్రాయిల్ వెళ్తారు.. తర్వాత అదానీకి సంబంధిత కాంట్రాక్ట్ వస్తుంది అంటూ ఆయన ఆరోపించారు. భారత్-ఇజ్రాయిల్ రక్షణ సంబంధాలు ధనికుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. ఇందులో పెగాసిస్ కూడా ఉందని విమర్శించారు. భారత రక్షణ రంగానికి ఎలక్ట్రానిక్స్ ను సరఫరా చేసే “అల్ఫా డీఫెన్స్” అనే కంపెనీ నీ కూడా అదానీ కైవసం చేసుకున్నారని పేర్కొన్నాడు.

రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిరణ్ రిజిజులు రాహుల్ ఆరోపణలను ఖండించారు. చేసే ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే చూపాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. లోకసభ కార్యక్రమాలకు సంబంధించి 353 నిబంధన కింద ముందుగా నోటీసు ఇవ్వకుండా ఏలాంటి ఆరోపణలు, బెదిరింపు చర్యలకు పాల్పడకూడదంటూ మాజీ మంత్రి రవిశంకర్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. ప్రధాని కి వ్యతిరేకంగా, నోటీసు ఇవ్వకుండా, నేరుగా చేసే ఆరోపణలు నిరాధారమైనవి.. రికార్డులు నుంచి రాహుల్ వ్యాఖ్యలను తొలగించాలంటూ డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adani case
  • agniveer
  • Bhart Jodo Yatra
  • bjp
  • parlament session

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions