National Language: జాతీయభాషగా హిందీ.. రాహుల్ గాంధీ అభిప్రాయమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Comeents on National Language: జాతీయ భాషగా హిందీ అనే వివాదంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు హిందీని తమపై రుద్దదంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హిందీని జాతీయభాషగా ప్రాంతీయ భాషలపై రద్దువద్దని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే జాతీయ భాషగా హిందీ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం భారత్ జోడో యాత్రలో భాగంగా పలు విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. హిందీ మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. కన్నడ వంటి ప్రాంతీయ బాషల ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. కన్నడ గుర్తింపుపై రాహుల్ గాంధీతో చర్చ జరిగింది. అందరి మాతృ భాష ముఖ్యమని.. అన్ని భాషలను గౌరవిస్తాం.. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికి హక్కు ఉందని పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. హిందీని మాత్రమే జాతీయ భాషగా చేసి కన్నడ గుర్తింపును బెదిరించే ఉద్దేశ్యం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా సెల్ ఇంఛార్జ్ అయిన ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
అయితే రాహుల్ గాంధీతో సమావేశం అయిన తమకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని.. రాజ్యాంగాన్ని కాపాడే యాత్రలో పాల్గొంటున్నామని చెప్పారు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రతినిధులు. ఏఐసీసీ రిసెర్చ్ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజీవ్ గౌడ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వంటి అన్ని విషయాలపై, విద్యారంగ సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించారని అన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రస్తుతం కర్ణాటక మాండ్యా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!