National Language: జాతీయభాషగా హిందీ.. రాహుల్ గాంధీ అభిప్రాయమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Comeents on National Language: జాతీయ భాషగా హిందీ అనే వివాదంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు హిందీని తమపై రుద్దదంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హిందీని జాతీయభాషగా ప్రాంతీయ భాషలపై రద్దువద్దని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే జాతీయ భాషగా హిందీ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం భారత్ జోడో యాత్రలో భాగంగా పలు విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. హిందీ మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. కన్నడ వంటి ప్రాంతీయ బాషల ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. కన్నడ గుర్తింపుపై రాహుల్ గాంధీతో చర్చ జరిగింది. అందరి మాతృ భాష ముఖ్యమని.. అన్ని భాషలను గౌరవిస్తాం.. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికి హక్కు ఉందని పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. హిందీని మాత్రమే జాతీయ భాషగా చేసి కన్నడ గుర్తింపును బెదిరించే ఉద్దేశ్యం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా సెల్ ఇంఛార్జ్ అయిన ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
అయితే రాహుల్ గాంధీతో సమావేశం అయిన తమకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని.. రాజ్యాంగాన్ని కాపాడే యాత్రలో పాల్గొంటున్నామని చెప్పారు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రతినిధులు. ఏఐసీసీ రిసెర్చ్ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజీవ్ గౌడ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వంటి అన్ని విషయాలపై, విద్యారంగ సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించారని అన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రస్తుతం కర్ణాటక మాండ్యా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!