National Language: జాతీయభాషగా హిందీ.. రాహుల్ గాంధీ అభిప్రాయమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Comeents on National Language: జాతీయ భాషగా హిందీ అనే వివాదంపై పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలు హిందీని తమపై రుద్దదంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రజలతో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హిందీని జాతీయభాషగా ప్రాంతీయ భాషలపై రద్దువద్దని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే జాతీయ భాషగా హిందీ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం భారత్ జోడో యాత్రలో భాగంగా పలు విద్యాసంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. హిందీ మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. కన్నడ వంటి ప్రాంతీయ బాషల ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. కన్నడ గుర్తింపుపై రాహుల్ గాంధీతో చర్చ జరిగింది. అందరి మాతృ భాష ముఖ్యమని.. అన్ని భాషలను గౌరవిస్తాం.. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికి హక్కు ఉందని పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. హిందీని మాత్రమే జాతీయ భాషగా చేసి కన్నడ గుర్తింపును బెదిరించే ఉద్దేశ్యం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా సెల్ ఇంఛార్జ్ అయిన ప్రియాంక్ ఖర్గే అన్నారు.
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
అయితే రాహుల్ గాంధీతో సమావేశం అయిన తమకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని.. రాజ్యాంగాన్ని కాపాడే యాత్రలో పాల్గొంటున్నామని చెప్పారు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రతినిధులు. ఏఐసీసీ రిసెర్చ్ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజీవ్ గౌడ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వంటి అన్ని విషయాలపై, విద్యారంగ సమస్యలపై రాహుల్ గాంధీతో చర్చించారని అన్నారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రస్తుతం కర్ణాటక మాండ్యా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!