Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ షడంగీ తీవ్ర విమర్శలు..
- డిసెంబర్ 19న రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
- లోక్సభలో విపక్ష నేత ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరైనది కాదు: ఎంపీ ప్రతాప్చంద్ర షడంగీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారు.. అలాంటి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. ఇక, తోపులాటలో గాయపడిన తాను డిసెంబరు 28వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది.. తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని బీజేపీ ఎంపీ ప్రతాప్చంద్ర షడంగీ చెప్పారు.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే, లోక్ సభలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ను అమిత్షా అవమానించారని విపక్షాలు ఆందోళన చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్సే అంబేద్కర్ ను అవమానిస్తోందంటూ మకరద్వారం మెట్లపై నిల్చొని ఎన్డీయే ఎంపీలు నిరసన చేశారు. అప్పుడే, ప్రతిపక్ష ఎంపీలూ ఆందోళన చేస్తున్నారు.. అప్పుడు పక్క నుంచి వెళ్లే ఛాన్స్ ఉన్నా.. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ గాంధీ సభలోకి వెళ్లడానికి ట్రై చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ఈ దాడిలో బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఇక, ఈ ఆరోపణలను రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!