Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ షడంగీ తీవ్ర విమర్శలు..
- డిసెంబర్ 19న రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారు..
- లోక్సభలో విపక్ష నేత ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరైనది కాదు: ఎంపీ ప్రతాప్చంద్ర షడంగీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్లా ప్రవర్తించారని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారు.. అలాంటి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. ఇక, తోపులాటలో గాయపడిన తాను డిసెంబరు 28వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది.. తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని బీజేపీ ఎంపీ ప్రతాప్చంద్ర షడంగీ చెప్పారు.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
అయితే, లోక్ సభలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ను అమిత్షా అవమానించారని విపక్షాలు ఆందోళన చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్సే అంబేద్కర్ ను అవమానిస్తోందంటూ మకరద్వారం మెట్లపై నిల్చొని ఎన్డీయే ఎంపీలు నిరసన చేశారు. అప్పుడే, ప్రతిపక్ష ఎంపీలూ ఆందోళన చేస్తున్నారు.. అప్పుడు పక్క నుంచి వెళ్లే ఛాన్స్ ఉన్నా.. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ గాంధీ సభలోకి వెళ్లడానికి ట్రై చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ఈ దాడిలో బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఇక, ఈ ఆరోపణలను రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!