Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Raghuram Rajan Calls Us Tariffs On India A Wake Up Call To Reduce Dependence On Single Trade Partner

Raghuram Rajan: అమెరికా సుంకాలు భారత్కి మేల్కొలుపు.. మాజీ ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!

Published Date :August 28, 2025 , 9:07 am
By Chandra Shekhar Pamena
  • అమెరికా టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం..
  • యూఎస్ సుంకాలను భారత్ మేల్కొలుపుగా పరిగణించాలి..
  • వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలో భారత్‌ జాగ్రత్తగా ఉండాలి: రఘురామ్ రాజన్
Raghuram Rajan: అమెరికా సుంకాలు భారత్కి మేల్కొలుపు.. మాజీ ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raghuram Rajan: అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.. ఇది దేశానికి మేల్కొలుపుగా పరిగణించాల్సిన అవసరం ఉందని మాజీ ఆర్బీఐ గవర్నర్‌, ఆర్థికవేత్త డాక్టర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలు నేటి ప్రపంచంలో ఆయుధాలుగా ఉపయోగించబడుతున్నాయన్నారు. ఇప్పుడు, భారత్‌ జాగ్రత్తగా ముందుకు కొనసాగాలని హెచ్చరించారు. ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా 50 శాతం టారిఫ్‌లతో ఇండియన్ ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చైనా, యూరప్‌ దేశాలు కూడా రష్యా నుంచి విస్తృతంగా ఎనర్జీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తూనే ఉన్నా.. వారిపై సుంకాలు ఎందుకు విధించడం లేదని రఘురామ్ రాజన్ ప్రశ్నించారు.

Read Also: JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

రష్యా చమురు దిగుమతులపై పునరాలోచన అవసరం
రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి అని మాజీ ఆర్బీఐ గవర్నర్ రాజన్ పేర్కొన్నారు. రిఫైనరీలు ఎక్కువ లాభాలు పొందుతున్నాయి.. కానీ, ఎగుమతిదారులు మాత్రం టారిఫ్‌లతో తీవ్రంగా నష్టపోతున్నారు.. లాభం పెద్దగా లేకపోతే, ఈ కొనుగోళ్లు కొనసాగించాలా లేదా అనే విషయాన్ని మళ్లీ ఆలోచించాలి అని సూచించారు.

Read Also: Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ

నవరో వ్యాఖ్యలకు కౌంటర్..
నేటి గ్లోబల్ ఆర్డర్‌లో ప్రతి దేశానికి వాణిజ్యం ఆయుధంగా మారింది అని రాఘురామ్ రాజన్ తెలిపారు. పెట్టుబడులు, ఫైనాన్స్ రంగాలు కూడా ఆయుధాలుగా మారాయి.. మనం ఎవరిపైనా ఆధారపడకుండా, అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని అన్నారు.. అమెరికా, చైనా, జపాన్ లేదా యూరప్‌ – ఎవరి తోనైనా కలిసి ముందుకు కొనసాగాలి.. ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడకూడదు అని హితవు పలికారు. ఇక, భారత్ రష్యా చమురు కొనుగోళ్లతో లాభాలు సంపాదిస్తూ భారత్ యుద్ధాన్ని పెంచుతోందని అమెరికా వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవర్రో చేసిన ఆరోపణలను రఘురామ్ రాజన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి అనుమతితోనే జరుగుతోంది అన్నారు. భారత్‌ను ఉద్దేశపూర్వకంగా ఒంటరిని చేశారని ఆరోపించారు.

Read Also: PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్ ఇంట్రో కోసం భారీ ప్లాన్

చిన్న ఎగుమతిదారులపై ప్రభావం
అయితే, ఈ టారిఫ్‌లు చిన్న ఎగుమతిదారులపై- ముఖ్యంగా రొయ్యల సాగుదారులు, టెక్స్టైల్ తయారీదారులపై పెద్ద షాక్ అని రాజన్ హెచ్చరించారు. లైవ్ హుడ్స్ నష్టపోతాయని, అదే సమయంలో అమెరికన్ వినియోగదారులు కూడా 50 శాతం పెరిగిన ధరలకు వస్తువులు కొనాల్సి వస్తుందన్నారు. అలాగే, ట్రంప్ ప్రభుత్వ టారిఫ్‌ల వెనుక మూడు ప్రధాన కారణాలను ఆయన సూచించారు. 1. వాణిజ్య లోటు అనేది ఇతర దేశాల దోపిడీ అని నమ్మకం.. 2. టారిఫ్‌లు విదేశీ ఉత్పత్తిదారులపై భారమై, అమెరికాకు చవకగా ఆదాయం వస్తుందని భావన.. 3. ఇటీవలి కాలంలో టారిఫ్‌లను విదేశాంగ విధానంలో కక్షసాధింపు కోసం ఉపయోగిస్తున్నారని రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు.

Read Also: Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..

భారత వైఖరి
అమెరికా ఒత్తిడికి లోనుకాకుండా, తమ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. అదే సమయంలో చైనా, యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూనే ఉన్నా, వారికి ఇలాంటి జరిమానాలు విధించకపోవడాన్ని భారత్ వివక్షతగా పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global trade weaponisation
  • India diversify trade
  • India economic reforms
  • India export tariffs
  • India US tensions

తాజావార్తలు

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • LPG Gas Supply: ఎల్‌పీజీపై కేంద్రం చర్యలు.. ఎస్మా ప్రయోగం

  • Dhurandhar – 2 : ధురంధర్ 2’ ఏకంగా 45 దేశాల్లో సంచలనం..

  • Tollywood : డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న స్టార్ డైరెక్టర్ శిష్యులు..

  • Kuldeep Yadav Marriage Date: ముహూర్తం ఫిక్స్.. పెళ్లిపీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్, పెళ్లి కూతురు ఎవరంటే?

ట్రెండింగ్‌

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions