Congress Party: ఉదయ్పూర్లో కనిపించని పీవీ నరసింహారావు హోర్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేయనుంది. ఇప్పటికే ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఉదయ్పూర్కు చేరుకున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్కు హాజరు కానున్నారు.
కాగా ఉదయ్ పూర్లో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఆ పార్టీ నేతల హోర్డింగులే కనిపిస్తున్నాయి. జాతిపిత మహాత్మగాంధీ చిత్ర పటంతో పాటు జాతీయ నాయకులు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, డా.మన్మోహన్ సింగ్ చిత్రపటాలతో కూడిన హోర్డింగ్లను కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. అలాగే దేశ భక్తుడు రవీంద్రనాధ్ ఠాగూర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్, సరోజినీ నాయుడు చిత్ర పటాలు కూడా ఏర్పాటు చేశారు. అటు సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బీఆర్. అంబేద్కర్ చిత్రపటాలతో కూడా హోర్డింగులు కూడా దర్శనమిస్తున్నాయి.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు

అయితే నవ సంకల్ప్ శిబిర్ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్ర పటం కానీ హోర్డింగ్ కానీ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేయకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పీవీ నరసింహారావు కేబినెట్లో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2లో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన చిత్రపటాలతో హోర్డింగులు దర్శనమిస్తున్నా.. పీవీ నరసింహారావు చిత్ర పటంతో హోర్డింగులు లేకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!