Congress Party: ఉదయ్పూర్లో కనిపించని పీవీ నరసింహారావు హోర్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేయనుంది. ఇప్పటికే ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఉదయ్పూర్కు చేరుకున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్కు హాజరు కానున్నారు.
కాగా ఉదయ్ పూర్లో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలు, ఆ పార్టీ నేతల హోర్డింగులే కనిపిస్తున్నాయి. జాతిపిత మహాత్మగాంధీ చిత్ర పటంతో పాటు జాతీయ నాయకులు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, డా.మన్మోహన్ సింగ్ చిత్రపటాలతో కూడిన హోర్డింగ్లను కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. అలాగే దేశ భక్తుడు రవీంద్రనాధ్ ఠాగూర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్, సరోజినీ నాయుడు చిత్ర పటాలు కూడా ఏర్పాటు చేశారు. అటు సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, బీఆర్. అంబేద్కర్ చిత్రపటాలతో కూడా హోర్డింగులు కూడా దర్శనమిస్తున్నాయి.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం

అయితే నవ సంకల్ప్ శిబిర్ సందర్భంగా పీవీ నరసింహారావు చిత్ర పటం కానీ హోర్డింగ్ కానీ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేయకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పీవీ నరసింహారావు కేబినెట్లో ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2లో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన చిత్రపటాలతో హోర్డింగులు దర్శనమిస్తున్నా.. పీవీ నరసింహారావు చిత్ర పటంతో హోర్డింగులు లేకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!