Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- మహారాష్ట్రలోని పూణెలో ఘోరం
- కాబోయే భర్తను పైకి పంపేసిన యువతి
- మరో 5 నెలల్లో ఉధయ్పూర్లో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి యువత ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి కొలది ఆలోచనలు కూడా కొత్త పొంతలు తొక్కుతున్నాయి. వివాహ వ్యవస్థపైన అవగాహన లేకనో.. లేదంటే తప్పుడు కోరికల వలనో తెలియదు గానీ.. తమ సుఖం కోసం అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు. గతేడాది మేఘాలయకు హనీమూన్కు తీసుకెళ్లి కట్టుకున్న భర్తనే సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసిన ఘటన అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో పెళ్లికాకముందే కాబోయే భర్తను పైకి పంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మహారాష్ట్రలోని పుణెలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ట్రెక్కర్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసు.. ఇప్పుడు హత్య కేసుగా మారింది. కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లుగా పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా భావించిన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అసలు విషయం తెలిసి హతాశులయ్యారు.
Also Read
పోలీసుల వివరాల ప్రకారం.. 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందినవాడు. తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. జూన్ 18న తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి చారిత్రాత్మక ప్రాంతమైన లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు పడిపోయినట్లుగా కాబోయే భార్య చెప్పడంతో పోలీసులు నమ్మి లైట్ తీసుకున్నారు. కేతన్ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో బలమైన గాలుల కారణంగా సమతుల్యత కోల్పోయి సుమారు 400 అడుగుల లోతైన లోయలో పడిపోయాడని చెప్పడంతో నమ్మేశారు. దీంతో ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.
అయితే తాజాగా దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాబోయే భార్యను లోతుగా విచారించడంతో సమాధానాలు తికమకగా చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. మరింత లోతుగా దర్యాప్తు చేయగా బండారం బయటపడింది. కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కేతన్ను ఉద్దేశపూర్వకంగానే లోయలోకి తోసివేసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కోణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మహారాష్ట్రలో తీవ్ర సంచలనంగా మారగా.. ప్రేమ, పెళ్లి, విశ్వాసం పేరుతో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు కేతన్ వివాహం ఈ ఏడాది నవంబర్లో జరగాల్సి ఉంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక రాజభవనాన్ని వివాహ వేడుకల కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లికి కొన్ని నెలల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చరిత్ర ప్రసిద్ధి చెందిన లోహగడ్ కోట, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉంది. ఇది మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న 12 కోటల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

తాజావార్తలు
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
-
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!