Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
- మహారాష్ట్రలోని పూణెలో ఘోరం
- కాబోయే భర్తను పైకి పంపేసిన యువతి
- మరో 5 నెలల్లో ఉధయ్పూర్లో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి యువత ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి కొలది ఆలోచనలు కూడా కొత్త పొంతలు తొక్కుతున్నాయి. వివాహ వ్యవస్థపైన అవగాహన లేకనో.. లేదంటే తప్పుడు కోరికల వలనో తెలియదు గానీ.. తమ సుఖం కోసం అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు. గతేడాది మేఘాలయకు హనీమూన్కు తీసుకెళ్లి కట్టుకున్న భర్తనే సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసిన ఘటన అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో పెళ్లికాకముందే కాబోయే భర్తను పైకి పంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
మహారాష్ట్రలోని పుణెలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించిన ట్రెక్కర్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసు.. ఇప్పుడు హత్య కేసుగా మారింది. కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కేతన్ను లోయలోకి తోసి చంపినట్లుగా పోలీసులు కనిపెట్టారు. దీంతో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా భావించిన కుటుంబ సభ్యులు.. ఇప్పుడు అసలు విషయం తెలిసి హతాశులయ్యారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
పోలీసుల వివరాల ప్రకారం.. 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందినవాడు. తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. జూన్ 18న తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి చారిత్రాత్మక ప్రాంతమైన లోహగడ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు పడిపోయినట్లుగా కాబోయే భార్య చెప్పడంతో పోలీసులు నమ్మి లైట్ తీసుకున్నారు. కేతన్ ఫోటోలు తీసుకుంటున్న సమయంలో బలమైన గాలుల కారణంగా సమతుల్యత కోల్పోయి సుమారు 400 అడుగుల లోతైన లోయలో పడిపోయాడని చెప్పడంతో నమ్మేశారు. దీంతో ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.
అయితే తాజాగా దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాబోయే భార్యను లోతుగా విచారించడంతో సమాధానాలు తికమకగా చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు రేకెత్తాయి. మరింత లోతుగా దర్యాప్తు చేయగా బండారం బయటపడింది. కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కేతన్ను ఉద్దేశపూర్వకంగానే లోయలోకి తోసివేసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హత్య కోణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మహారాష్ట్రలో తీవ్ర సంచలనంగా మారగా.. ప్రేమ, పెళ్లి, విశ్వాసం పేరుతో జరిగిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరోవైపు కేతన్ వివాహం ఈ ఏడాది నవంబర్లో జరగాల్సి ఉంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఒక రాజభవనాన్ని వివాహ వేడుకల కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లికి కొన్ని నెలల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చరిత్ర ప్రసిద్ధి చెందిన లోహగడ్ కోట, ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉంది. ఇది మహారాష్ట్రలోని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న 12 కోటల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!