Quarrel with wife: భార్యతో గొడవ పడి నదిలో దూకిన వ్యక్తి.. రెస్య్కూ ఆపరేషన్ చేసిన జాడ లేదు.. చివరకు అద్భుతం..
- భార్యతో గొడవపడి నదిలోకి దూకిన వ్యక్తి..
- 8 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్..
- జాడ తెలియకపోవడంతో రెస్క్యూని నిలిపేసి అధికారులు..
- చివరకు అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quarrel with wife: తన భార్యతో గొడవ పడిన 45 ఏళ్ల వ్యక్తి పూణేలోని పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనూహ్యంగా అతను 8 గంటల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక దళాలు గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించిన అతడి ఆచూకీ లభించలేదు, చివరకు నదిలోని పొదలల్లో వేలాడుతున్న స్థితిలో కనిపించాడు. వరదతో ఉప్పొంగుతున్న నదిలో ఇంత సేపు ఎలా జీవించి ఉన్నాడో తెలియక అధికారులు షాక్ అవుతున్నారు. చివరకు అతడు సజీవంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే చించ్వాడ్లోని చించ్వాడేనగర్కి చెందిన అబాసాహెబ్ కేశవ్ పవార్ శనివారం ఉదయం 11 గంటలకు వాల్హెకర్వాడి ప్రాంతంలోని జాదవ్ ఘాట్ వద్ద పావన నదిలోకి దూకాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు పింప్రి-చించ్వాడ్ అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. తాగుడుకు బానిసైన పవార్, తన భార్యతో గొడవ పడి నదిలో దూకినట్లు చెప్పారు. ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక అధికారులు అతడి కోసం నదిలో శోధించారు. అగ్నిమాపక అధికారి గౌతమ్ ఇంగ్వాకే మాట్లాడుతూ.. ‘‘మేము చెట్టు కొమ్మకు వేలాడుతున్న చొన్నాను గుర్తించాము. అప్పుడు ప్రవాహం తీవ్రంగా ఉన్న నదిలో చెట్లు, పొదల్లో వెతకడం ప్రారంభించాము. అయినప్పటికీ అతడి జాడ కనుగొనలేకపోయాము’’ అని చెప్పారు.
Also Read
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- CJP Protest: "4 గంటల సమయం దండగ".. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
- Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
Read Also: Alluri District: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, 20 మంది సేఫ్
కుటుంబ సభ్యుల ముందే పవార్ నదిలోకి దూకినట్లు ఇంగ్వాలే చెప్పారు. పావన డ్యాం నుంచి 4000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో నది తీవ్ర ప్రవాహాంతో ఉంది. అయితే, కేశవ్ పవార్ ఈత కొట్టడంతో నిష్ణాతుడని అధికారులు గుర్తించారు. దీంతో అతను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండొచ్చని అధికారులు భావించారు. చాలా సేపటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ అతడి జాడ కనుగొనలేకపోయారు. రాత్రి సమయం కావడంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారు.రాత్రి 8 గంటలకు నది ఒడ్డున అతడిని గుర్తించినట్లు ఫోన్ వచ్చిందని ఇంగ్వాలే చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నదిలో మునిగిపోకుండా పొదల్లో వేలాడుతున్నట్లు ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అతడిని రక్షించారు.
తాజావార్తలు
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!