Quarrel with wife: భార్యతో గొడవ పడి నదిలో దూకిన వ్యక్తి.. రెస్య్కూ ఆపరేషన్ చేసిన జాడ లేదు.. చివరకు అద్భుతం..
- భార్యతో గొడవపడి నదిలోకి దూకిన వ్యక్తి..
- 8 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్..
- జాడ తెలియకపోవడంతో రెస్క్యూని నిలిపేసి అధికారులు..
- చివరకు అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quarrel with wife: తన భార్యతో గొడవ పడిన 45 ఏళ్ల వ్యక్తి పూణేలోని పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనూహ్యంగా అతను 8 గంటల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక దళాలు గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించిన అతడి ఆచూకీ లభించలేదు, చివరకు నదిలోని పొదలల్లో వేలాడుతున్న స్థితిలో కనిపించాడు. వరదతో ఉప్పొంగుతున్న నదిలో ఇంత సేపు ఎలా జీవించి ఉన్నాడో తెలియక అధికారులు షాక్ అవుతున్నారు. చివరకు అతడు సజీవంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే చించ్వాడ్లోని చించ్వాడేనగర్కి చెందిన అబాసాహెబ్ కేశవ్ పవార్ శనివారం ఉదయం 11 గంటలకు వాల్హెకర్వాడి ప్రాంతంలోని జాదవ్ ఘాట్ వద్ద పావన నదిలోకి దూకాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు పింప్రి-చించ్వాడ్ అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. తాగుడుకు బానిసైన పవార్, తన భార్యతో గొడవ పడి నదిలో దూకినట్లు చెప్పారు. ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక అధికారులు అతడి కోసం నదిలో శోధించారు. అగ్నిమాపక అధికారి గౌతమ్ ఇంగ్వాకే మాట్లాడుతూ.. ‘‘మేము చెట్టు కొమ్మకు వేలాడుతున్న చొన్నాను గుర్తించాము. అప్పుడు ప్రవాహం తీవ్రంగా ఉన్న నదిలో చెట్లు, పొదల్లో వెతకడం ప్రారంభించాము. అయినప్పటికీ అతడి జాడ కనుగొనలేకపోయాము’’ అని చెప్పారు.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Alluri District: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, 20 మంది సేఫ్
కుటుంబ సభ్యుల ముందే పవార్ నదిలోకి దూకినట్లు ఇంగ్వాలే చెప్పారు. పావన డ్యాం నుంచి 4000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో నది తీవ్ర ప్రవాహాంతో ఉంది. అయితే, కేశవ్ పవార్ ఈత కొట్టడంతో నిష్ణాతుడని అధికారులు గుర్తించారు. దీంతో అతను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండొచ్చని అధికారులు భావించారు. చాలా సేపటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ అతడి జాడ కనుగొనలేకపోయారు. రాత్రి సమయం కావడంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారు.రాత్రి 8 గంటలకు నది ఒడ్డున అతడిని గుర్తించినట్లు ఫోన్ వచ్చిందని ఇంగ్వాలే చెప్పారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నదిలో మునిగిపోకుండా పొదల్లో వేలాడుతున్నట్లు ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అతడిని రక్షించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!