High Court: పెళ్లైనవారి ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..
- వివాహితుల ‘సహజీవనం’పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- తల్లిదండ్రుల గౌరవాన్ని తీసే ఇలాంటి వాటిని సమర్థించం..
- వారికి రక్షణ కల్పించడం తప్పును ప్రోత్సహించడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: వివాహితులు ‘‘సహజీవనం’’ చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో ఉండే వివాహితులకు రక్షణ కల్పించడం ‘‘తప్పు చేసేవారిని’’ ప్రోత్సహించడం, ద్వంద్వ వివాహాలను ప్రోత్సహించడం లాంటిదే అని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రుల నుంచి ఇళ్ల నుంచి పారిపోయే ఇలాంటి జంటలు తమ కుటుంబాలకు చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, గౌరవంగా జీవించే తల్లిదండ్రుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని జస్టిస్ సందీప్ మౌద్గిల్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
40 ఏళ్ల మహిళ, 44 ఏళ్ల పురుషుడు తమ కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయనే కారణంగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్తో సహా అనేక పిటిషన్లపై కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లులు ఉన్నప్పటికీ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. పిటిషన్ దాఖలు చేసినవారికి ఇంతకు ముందే పెళ్లైందనే విషయం తెలుసని, వారు సహజీవనంలోకి ప్రవేశించకూడదని వారికి అవగాహన ఉందని కోర్టు అభిప్రాయపడింది. సహజీవనంలో ఉన్న పురుషుడు తన భార్య నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పింది. అన్ని సహజీవనాలు వివాహ స్వభావాన్ని కలిగి ఉండవని కోర్టు పేర్కొంది.
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
పిటిషనర్ల మధ్య ఉన్న సంబంధం వివాహ సంబంధంగా కోర్టు భావిస్తే, అది పురుషుడి భార్య, పిల్లలకు అన్యాయం చేసినట్లే అని కోర్టు పేర్కొంది. వివాహం అనేది ప్రజా ప్రాముఖ్యత కలిగిన సంబంధమని కోర్టు చెప్పింది. వివాహం అనేది కుటుంబ వ్యవస్థ భద్రతను అందించే సామాజిక విషయమని, పిల్లల పెంపకంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, వివాహం అనేది నైతిక మరియు చట్టబద్దమైన బాధ్యతలకు దారి తీస్తుందని, ముఖ్యంగా భార్యాభర్తలకు మద్దతు ఇవ్వడం, వివాహం నుంచి జన్మించిన పిల్లలకు మద్దతు ఇవ్వడం, పెంచడం వారి ఉమ్మడి బాధ్యత అని కోర్టు చెప్పింది.
Read Also: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి వ్యక్తికి శాంతి, గౌరవం మరియు గౌరవంతో జీవించే హక్కు ఉంది, కాబట్టి అలాంటి పిటిషన్లను అనుమతించడం ద్వారా, మేము తప్పు చేసిన వారిని ప్రోత్సహిస్తున్నాము మరియు ఎక్కడో పెద్ద భార్యాభర్తల ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నాము. సెక్షన్ 494, IPC కింద నేరం, ఆర్టికల్ 21 ప్రకారం ఇతర జీవిత భాగస్వామి మరియు పిల్లలు గౌరవంగా జీవించే హక్కును మరింత ఉల్లంఘించడం.’’ అని కోర్టు పేర్కొంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావన గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉందని, మహిళ-పురుషుడు ఇంటి నుంచి పారిపోయి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా, తల్లిదండ్రులు గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘించారని కోర్టు చెప్పింది. ఇలాంటి వారికి పోలీసుల రక్షణ కల్పించడం అక్రమ సంబంధానికి పరోక్షంగా సమ్మతి తెలియజేయడమే అని చెప్పింది.
భారతదేశం విభిన్నమైన సూత్రాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు నమ్మకాలను కలిగి ఉన్న దేశమని, అవి అవసరమైన చట్టపరమైన మూలాలుగా పనిచేస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వివాహం అనేది చట్టపరమైన పరిణామాలు, గొప్ప సామాజిక గౌరవంతో కూడి పవిత్ర బంధమని, మనదేశం వివాహం యొక్క లోతైన సాంస్కృతిక మూలాలతో, నైతికత, నైతిక తార్కికానికి గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుందని కోర్టు చెప్పింది. ఇటీవల కాలంలో భారతీయ సంస్కృతికి భిన్నమైన పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించడం ప్రారంభామని, కొంతకాలంగా ఆధునిక జీవన శైలి, లివ్-ఇన్ రిలేషన్షిప్లను అవలంభిస్తోందని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!