High Court: పెళ్లైనవారి ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..
- వివాహితుల ‘సహజీవనం’పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- తల్లిదండ్రుల గౌరవాన్ని తీసే ఇలాంటి వాటిని సమర్థించం..
- వారికి రక్షణ కల్పించడం తప్పును ప్రోత్సహించడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: వివాహితులు ‘‘సహజీవనం’’ చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో ఉండే వివాహితులకు రక్షణ కల్పించడం ‘‘తప్పు చేసేవారిని’’ ప్రోత్సహించడం, ద్వంద్వ వివాహాలను ప్రోత్సహించడం లాంటిదే అని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రుల నుంచి ఇళ్ల నుంచి పారిపోయే ఇలాంటి జంటలు తమ కుటుంబాలకు చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, గౌరవంగా జీవించే తల్లిదండ్రుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని జస్టిస్ సందీప్ మౌద్గిల్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
40 ఏళ్ల మహిళ, 44 ఏళ్ల పురుషుడు తమ కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయనే కారణంగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్తో సహా అనేక పిటిషన్లపై కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లులు ఉన్నప్పటికీ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. పిటిషన్ దాఖలు చేసినవారికి ఇంతకు ముందే పెళ్లైందనే విషయం తెలుసని, వారు సహజీవనంలోకి ప్రవేశించకూడదని వారికి అవగాహన ఉందని కోర్టు అభిప్రాయపడింది. సహజీవనంలో ఉన్న పురుషుడు తన భార్య నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పింది. అన్ని సహజీవనాలు వివాహ స్వభావాన్ని కలిగి ఉండవని కోర్టు పేర్కొంది.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
పిటిషనర్ల మధ్య ఉన్న సంబంధం వివాహ సంబంధంగా కోర్టు భావిస్తే, అది పురుషుడి భార్య, పిల్లలకు అన్యాయం చేసినట్లే అని కోర్టు పేర్కొంది. వివాహం అనేది ప్రజా ప్రాముఖ్యత కలిగిన సంబంధమని కోర్టు చెప్పింది. వివాహం అనేది కుటుంబ వ్యవస్థ భద్రతను అందించే సామాజిక విషయమని, పిల్లల పెంపకంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, వివాహం అనేది నైతిక మరియు చట్టబద్దమైన బాధ్యతలకు దారి తీస్తుందని, ముఖ్యంగా భార్యాభర్తలకు మద్దతు ఇవ్వడం, వివాహం నుంచి జన్మించిన పిల్లలకు మద్దతు ఇవ్వడం, పెంచడం వారి ఉమ్మడి బాధ్యత అని కోర్టు చెప్పింది.
Read Also: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి వ్యక్తికి శాంతి, గౌరవం మరియు గౌరవంతో జీవించే హక్కు ఉంది, కాబట్టి అలాంటి పిటిషన్లను అనుమతించడం ద్వారా, మేము తప్పు చేసిన వారిని ప్రోత్సహిస్తున్నాము మరియు ఎక్కడో పెద్ద భార్యాభర్తల ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నాము. సెక్షన్ 494, IPC కింద నేరం, ఆర్టికల్ 21 ప్రకారం ఇతర జీవిత భాగస్వామి మరియు పిల్లలు గౌరవంగా జీవించే హక్కును మరింత ఉల్లంఘించడం.’’ అని కోర్టు పేర్కొంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావన గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉందని, మహిళ-పురుషుడు ఇంటి నుంచి పారిపోయి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా, తల్లిదండ్రులు గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘించారని కోర్టు చెప్పింది. ఇలాంటి వారికి పోలీసుల రక్షణ కల్పించడం అక్రమ సంబంధానికి పరోక్షంగా సమ్మతి తెలియజేయడమే అని చెప్పింది.
భారతదేశం విభిన్నమైన సూత్రాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు నమ్మకాలను కలిగి ఉన్న దేశమని, అవి అవసరమైన చట్టపరమైన మూలాలుగా పనిచేస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వివాహం అనేది చట్టపరమైన పరిణామాలు, గొప్ప సామాజిక గౌరవంతో కూడి పవిత్ర బంధమని, మనదేశం వివాహం యొక్క లోతైన సాంస్కృతిక మూలాలతో, నైతికత, నైతిక తార్కికానికి గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుందని కోర్టు చెప్పింది. ఇటీవల కాలంలో భారతీయ సంస్కృతికి భిన్నమైన పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించడం ప్రారంభామని, కొంతకాలంగా ఆధునిక జీవన శైలి, లివ్-ఇన్ రిలేషన్షిప్లను అవలంభిస్తోందని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!