Khalistan: కెనడా పీఎం ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉన్నాడు. తాజాగా టొరంటోలో జరిగి ఖల్సా డే సెలబ్రేషన్స్లో పీఎం ట్రూడో, ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే సమక్షంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. కెనడాలో ఇటీవల కాలంలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కొందరు రాడికల్ సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి మద్దతుగా ట్రూడో ప్రభుత్వం, అతని పార్టీ వ్యవహరిస్తోంది.
ట్రూడోతో అధికారాన్ని పంచుకుంటున్న ఖలిస్తాన్ అనుకూల పార్టీ ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు వినిపించాయి. ప్రతిపక్ష నాయకుడు పియరీ ప్రోయిలీవ్రే కార్యక్రమంలో మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో కూడా ఇలాంటి నినాదాలే వినిపించాయి. టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. సిక్కు కొత్త సంవత్సర వైశాఖని ఖల్సాడే అని కూడా పిలుస్తారు.
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
Read Also: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..
ఇక ప్రధాని జస్టిన్ ట్రూడో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడే సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయి. దేశంలోని సిక్కు కమ్యూనిటీ హక్కులు, స్వేచ్ఛలను అన్ని విధాలుగా రక్షించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. కెనడాలో దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు ఉన్నారు. ద్వేషం, వివక్షకు వ్యతిరేకంగా మీ కమ్యూనిటీని రక్షించుకుంటామని చెప్పారు.
భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతేడాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని కెనడాలోని సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ప్రధాని ట్రూడో ఆరోపించాడు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైన, ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఇండియా కొట్టిపారేసింది. కెనడా గడ్డ గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులకు నిలయంగా మారిందని భారత్ ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!