Priyanka Gandhi: ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తోంది’’.. పినరయి వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంకాగాంధీ..
- మతతత్వ జమాలే ఇస్లామీ మద్దతుతో ప్రియాంకా పోటీ..
- కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు..
- ప్రజల సమస్యలపై స్పందించాలని ప్రియాంకా కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీపై ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతతత్వ సంస్థ ‘‘జమాతే ఇస్లామీ’’ మద్దతుతో ఆమె వయనాడోలో పోటీ చేస్తుందని విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రియాంకా గాంధీ స్పందించారు. “అభివృద్ధి వంటి వాస్తవ విషయాలపై రాజకీయ నేతలు మాట్లాడాలి. వాయనాడ్కు వారు ఏమి చేసారు? దాని గురించి మాట్లాడాలి. ధరల పెరుగుదల, అభివృద్ధి, నిరుద్యోగం వంటి ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై ఎన్నికలు జరగాలి. మనం ప్రజలను మభ్యపెట్టకూడదు.”అని ఆమె అన్నారు.
Read Also: Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
వయనాడ్ ఉప ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ లౌకిక ముసుగు పూర్తి బట్టబయలైంది. ’’ అని ఇటీవల విజయన్ తన ఫేస్బుక్ పోస్టులో విమర్శించారు. “ప్రియాంక గాంధీ అక్కడ జమాతే ఇస్లామీ మద్దతుతో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ వైఖరి ఏమిటి? మన దేశానికి జమాతే ఇస్లామీ గురించి తెలియనిది కాదు. ఆ సంస్థ సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా?, లౌకికవాదం కోసం నిలబడే వారు అన్ని రకాల మతోన్మాదాలను వ్యతిరేకించకూడదా?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ జమాతే ఇస్లామీ సంస్థను తిరస్కరించగలదా..? ముస్లిం లీగ్తో సహా కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు జమాతే ఇస్లామీ పొత్తు కోసం త్యాగాలు చేస్తున్నాయని, జమాతే ఇస్లామీ ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించగలదా..? అని సవాల్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, వయనాడ్కి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని నిలబెట్టింది. బీజేపీ నుంచి నవ్య హరిదాస్, లెఫ్ట్ కూటమి నుంచి సత్యేన్ మొకేరి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!