Priyanka Gandhi: ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తోంది’’.. పినరయి వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంకాగాంధీ..
- మతతత్వ జమాలే ఇస్లామీ మద్దతుతో ప్రియాంకా పోటీ..
- కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు..
- ప్రజల సమస్యలపై స్పందించాలని ప్రియాంకా కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీపై ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతతత్వ సంస్థ ‘‘జమాతే ఇస్లామీ’’ మద్దతుతో ఆమె వయనాడోలో పోటీ చేస్తుందని విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రియాంకా గాంధీ స్పందించారు. “అభివృద్ధి వంటి వాస్తవ విషయాలపై రాజకీయ నేతలు మాట్లాడాలి. వాయనాడ్కు వారు ఏమి చేసారు? దాని గురించి మాట్లాడాలి. ధరల పెరుగుదల, అభివృద్ధి, నిరుద్యోగం వంటి ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై ఎన్నికలు జరగాలి. మనం ప్రజలను మభ్యపెట్టకూడదు.”అని ఆమె అన్నారు.
Read Also: Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
వయనాడ్ ఉప ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ లౌకిక ముసుగు పూర్తి బట్టబయలైంది. ’’ అని ఇటీవల విజయన్ తన ఫేస్బుక్ పోస్టులో విమర్శించారు. “ప్రియాంక గాంధీ అక్కడ జమాతే ఇస్లామీ మద్దతుతో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ వైఖరి ఏమిటి? మన దేశానికి జమాతే ఇస్లామీ గురించి తెలియనిది కాదు. ఆ సంస్థ సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా?, లౌకికవాదం కోసం నిలబడే వారు అన్ని రకాల మతోన్మాదాలను వ్యతిరేకించకూడదా?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ జమాతే ఇస్లామీ సంస్థను తిరస్కరించగలదా..? ముస్లిం లీగ్తో సహా కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు జమాతే ఇస్లామీ పొత్తు కోసం త్యాగాలు చేస్తున్నాయని, జమాతే ఇస్లామీ ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించగలదా..? అని సవాల్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, వయనాడ్కి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని నిలబెట్టింది. బీజేపీ నుంచి నవ్య హరిదాస్, లెఫ్ట్ కూటమి నుంచి సత్యేన్ మొకేరి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!