Priyanka Gandhi: ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తోంది’’.. పినరయి వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంకాగాంధీ..
- మతతత్వ జమాలే ఇస్లామీ మద్దతుతో ప్రియాంకా పోటీ..
- కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు..
- ప్రజల సమస్యలపై స్పందించాలని ప్రియాంకా కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీపై ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతతత్వ సంస్థ ‘‘జమాతే ఇస్లామీ’’ మద్దతుతో ఆమె వయనాడోలో పోటీ చేస్తుందని విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రియాంకా గాంధీ స్పందించారు. “అభివృద్ధి వంటి వాస్తవ విషయాలపై రాజకీయ నేతలు మాట్లాడాలి. వాయనాడ్కు వారు ఏమి చేసారు? దాని గురించి మాట్లాడాలి. ధరల పెరుగుదల, అభివృద్ధి, నిరుద్యోగం వంటి ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై ఎన్నికలు జరగాలి. మనం ప్రజలను మభ్యపెట్టకూడదు.”అని ఆమె అన్నారు.
Read Also: Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
వయనాడ్ ఉప ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ లౌకిక ముసుగు పూర్తి బట్టబయలైంది. ’’ అని ఇటీవల విజయన్ తన ఫేస్బుక్ పోస్టులో విమర్శించారు. “ప్రియాంక గాంధీ అక్కడ జమాతే ఇస్లామీ మద్దతుతో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ వైఖరి ఏమిటి? మన దేశానికి జమాతే ఇస్లామీ గురించి తెలియనిది కాదు. ఆ సంస్థ సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా?, లౌకికవాదం కోసం నిలబడే వారు అన్ని రకాల మతోన్మాదాలను వ్యతిరేకించకూడదా?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ జమాతే ఇస్లామీ సంస్థను తిరస్కరించగలదా..? ముస్లిం లీగ్తో సహా కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు జమాతే ఇస్లామీ పొత్తు కోసం త్యాగాలు చేస్తున్నాయని, జమాతే ఇస్లామీ ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించగలదా..? అని సవాల్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, వయనాడ్కి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని నిలబెట్టింది. బీజేపీ నుంచి నవ్య హరిదాస్, లెఫ్ట్ కూటమి నుంచి సత్యేన్ మొకేరి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!