Modi-Advani: అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
- అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్డే విషెస్ చెప్పిన ప్రధాని మోడీ
- 97వ బర్త్డే జరుపుకుంటున్న రాజకీయ కురువృద్ధుడు అద్వానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే.అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీ శుక్రవారం (నవంబర్ 8) 97వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రధాని మోడీ బర్త్డే విషెస్ చెప్పారు. అద్వానీ ఇంటికి వెళ్లిన మోడీ.. పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ అగ్ర నేతలంతా అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ కూడా.. అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అద్వానీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
అద్వానీ బీజేపీలో సీనియర్ నాయకుడు. 1927, నవంబర్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు.
2024 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో మార్చి 30న జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోవడంతో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మార్చి 31న స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసింది. ఇటీవల పలుమార్లు అద్వానీ అనారోగ్యానికి గురయ్యారు. తిరిగి కోలుకుని ఇంటి దగ్గరే ఉంటున్నారు.
Went to Advani Ji's residence and wished him on his birthday. pic.twitter.com/eXU4mAn6gB
— Narendra Modi (@narendramodi) November 8, 2024
Delhi: Haryana CM Nayab Singh Saini met and extended birthday greetings to veteran BJP leader LK Advani at his residence today.
(Pics: CM Nayab Saini's social media handle 'X') pic.twitter.com/vAUucN9EjA
— ANI (@ANI) November 8, 2024
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!