PM Modi: “గుజరాత్ అల్లర్ల” గురించి మాట్లాడిన మోడీ.. ఏమన్నారంటే..
- గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్ కాస్ట్లో మాట్లాడిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2002 సబర్మతి ఎక్స్ప్రెస్పై దాడి, గుజరాత్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రాలో 2002 సబర్మతి ఎక్స్ప్రెస్పై జరిగిన దాడి “ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం” అని ఆయన అన్నారు. దీని తర్వాత జరిగిన అల్లర్లు ‘‘ప్రతీ ఒక్కరికి విషాదకరమైనవి’’గా చెప్పారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్లో ఒక్క అల్లరి కూడా జరగలేదని అన్నారు.
మూడు గంటల పాడ్కాస్ట్లో గుజరాత్ అల్లర్లనుంచి ఏం చేర్చుకున్నారని ప్రధానిని ప్రశ్నించిన నేపథ్యంలో, ప్రధాని మోడీ ఈ సంఘటనల గురించి చెప్పారు. ‘‘2001 అక్టోబర్ 07న గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్నాను, అప్పటికే గుజరాత్ భారీ భూకంపం నుంచి కోలుకుంటుంది, నాకు ప్రభుత్వ పాలన అనుభవం లేదు, ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర కూడా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో తాను సీఎం పదవిని చేపట్టాను’’ అని మోడీ చెప్పారు. 2002 ఫిబ్రవరి 24న తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, ఫిబ్రవరి 27న బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గోద్రా అల్లర్లు జరిగిన విషయాన్ని మోడీ వెల్లడించారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ హతం..? పాక్ ఎస్ఎంలో వైరల్ న్యూస్..
ఇది ఊహించలేని స్థాయిలో జరిగిన విషాదం, ప్రజల్ని సజీవ దహనం చేశారని ప్రధాని మోడీ అన్నారు. అల్లర్లకు ముందు 12-15 నెలల్లో జరిగిన సంఘటనలను మోడీ వివరించారు. ‘‘ 1999 డిసెంబర్ 24న కాందహార్ హైజాక్ అయింది, 2000లో ఢిల్లీ ఎర్రకోటపై దాడి జరిగింది. 2001లో అమెరికా ట్విన్ టవర్స్పై అటాక్, 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, డిసెంబర్ 13 పార్లమెంట్పై దాడి జరిగింది. ఈ సంఘటనలు దేశంలో ఉద్రిక్తతల్ని పెంచాయి’’ అని మోడీ చెప్పారు.
2002 గుజరాత్ అల్లర్లు అతిపెద్దవి కాదని, 2002కి ముందు గుజరాత్లో అనేక అల్లర్లు జరిగాయి. 250కి పైగా పెద్ద అల్లర్లు జరిగాయని, 1969లో 6 నెలల పాటు అల్లర్లు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 2002 నుంచి గుజరాత్లో ఒక్క అల్లరి జరగలేదని మోడీ చెప్పారు. మేము రాజకీయ లబ్ధి కోసం పనిచేయడం మానేశామని, బుజ్జగింపు రాజకీయాల స్థానంలో ఆశయాల రాజకీయాలను తెచ్చామని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!