Droupadi murmu: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- ఈ నెల 19న పర్యటన ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Droupadi murmu: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల పర్యటన ఖరారైంది. ఈ నెల 19న ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ద్రౌపది ముర్ము శబరిమల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 18న కొట్టాయం చేరుకుంటానని, 19న శబరిమల సందర్శన చేస్తానని ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి భవన్ ఈ కార్యక్రమ వివరాలను ఈ రోజు కేరళ ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రపతి తన కేరళ పర్యటనలో భాగంగా కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలను సందర్శిస్తారు.
Read Also: PM Modi: వాయుసేనను ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరించిన మోడీ
Also Read
మాజీ రాష్ట్రపతి వివి గిరి తర్వాత ద్రౌపదిముర్ము శబరిమలను దర్శించిన రెండో రాష్ట్రపతి అవుతారు. మే 18న రాష్ట్రపతి కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలాలో ఉన్న సెయింట్ థామస్ కాలేజ్ జూబ్లీ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. కొట్టాయంలో ఉన్న కుమారకోమ్లో ఆమె బస చేస్తారు. మే 19న రాష్ట్రపతి హెలికాప్టర్ ద్వారా నీలక్కల్ చేరుకుంటారు. నీలక్కల్ నుండి, రాష్ట్రపతి రోడ్డు మార్గంలో పంబకు ప్రయాణించి, ఆపై కాలినడకన శబరిమల ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రపతి సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబా ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రపతి కీలక భేటీల్లో పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత అమిత్ షా, జైశంకర్ వంటి మంత్రులు ఆమెతో భేటీ అయ్యారు. ఇటీవల, ప్రధాని నరేంద్రమోడీ కూడా రాష్ట్రపతిని కలిశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పులు నిలిచిపోయాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!