Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
- సరస్వతి నది ఉండేదా..?
- సంచలనంగా మారిన సైంటిస్టుల రీసెర్చ్..
- గంగా-యమునల మధ్య మరో నదికి ఆనవాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswati river: ‘‘సరస్వతి నది’’, పూర్వకాలం భారతదేశంలో ప్రవహించిన పవిత్ర నదిగా పేరుంది. రుగ్వేదంలో సరస్వతి ప్రస్తావన ఉంది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవిస్తుందని హిందువుల నమ్మకం. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజ్లో గంగా, యమున సంగమ ప్రదేశాన్ని ‘‘త్రివేణి సంగమం’’ గా భావిస్తారు. ఇదే చోట ‘‘సరస్వతి నది’’ కూడా ఈ రెండు నదులతో కలుస్తుందని హిందువుల నమ్మకం.
అయితే, ఈ నమ్మకానికి బలమైన శాస్త్రీయ ఆధారాలను హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు గుర్తించారు. గంగా-యమునా నదుల మధ్య ఒకప్పుడు భూగర్బంలో ఒక విశాలమైన ప్రాచీన నది(పాలియోరివర్) ప్రవేశించేదని ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించి కనుగొన్నారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే ‘‘సరస్వతి’’ నది నిజంగా ప్రవహించిందని నమ్ముతున్నవారికి ఇది ఒక శాస్త్రీయ ఆధారాన్ని అందిస్తుంది.
Also Read
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
Read Also: The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు హెలికాప్టర్ సర్వేలు, డ్రిల్లింగ్ను (బోరింగ్) ఉపయోగించారు. డాక్టర్ సుభాష్ చంద్ర బృందం గంగా -యమునా దోఆబ్ ప్రాంతంలో భూమికి 10-15 మీటర్ల దిగువన ఒక పెద్ద నదీ లోయను కనుగొంది. ఈ ఆవిష్కరణ పూర్తిగా నిర్ధారించబడిందని ఆయన తెలిపారు. డ్రిల్లింగ్ ద్వారా శాస్త్రీయ ఆధారాలు పొందినట్లు చెప్పారు.
భూగర్భ నది లేదా పురాతన నదీమార్గం 4-5 కిలోమీటర్ల వెడల్పుతో దాదాపు గంగా, యమున నదులంతా పెద్దదిగా ఉండేదని తేలింది. దీని లోతు కూడా రెండు నదుల మాదిరిగానే ఉండేదని, ఇది గంగా-యమునా నదుల పాత ప్రవాహ మార్గం కాదని, ఇది ఒక ప్రత్యేక నదికి సంబంధించినదిగా తేలింది. ఈ నది గంగా-యమునాల పక్కనే ప్రవిస్తోందని తెలిసింది. మొదట్లో 45 కిలోమీటర్లుగా దీని పొడవును అంచనా వేస్తే, ప్రస్తుతం దీని పొడవు కాన్పూర్ వరకు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండటం సైంటిస్టుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది పశ్చిమ దిశగా హిమాలయాల వరకు మరింతగా విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సంగమ స్థలంగా భావిస్తున్న ప్రాంతం నుంచి 25 కి.మీ వరకు శాస్త్రవేత్తలు నదిని స్పష్టంగా గుర్తించారు. అయితే, జనాభా విస్తరణ, భవనాల కారణంగా సర్వే చేయడం కష్టంగా మారింది. ఈ ప్రాచీన నది సరస్వతీ నది వర్ణనలతో సరిగ్గా సరిపోతుంది. తాజా పరిశోధనల్ని బట్టి చూస్తే కాలక్రమంలో ఒక పెద్ద నది భూగర్భంలో కలిసిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!