Prashant Bhushan: ‘‘ఆప్ పతనం ప్రారంభమైంది..’’ ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితుడు..
- ఆప్ పతనం ప్రారంభమైంది..
- ఓటమికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలి..
- ప్రశాంత్ భూషన్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Bhushan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో సహా కీలక నేతలైన మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేందర్ జైన్ వంటి వారు కూడా ఓడిపోయారు. కీలక నేతల్లో కేవలం అతిశీ మార్లేనా మాత్రమే విజయం సాధించారు. బీజేపీ, ఆప్ని ఒక విధంగా ఉడ్చేసిందని చెప్పొచ్చు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 బీజేపీ గెలుచుకోగా, ఆప్ 22 చోట్ల మాత్రమే విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో ఒకప్పటి కేజ్రీవాల్ సన్నిహితుడు, ఇండియా అగైనిస్ట్ కరెప్షన్ ఉద్యమంలో పాల్గొన్న ప్రశాంత్ భూషన్ కేజ్రీవాల్పై నిప్పులు చెరిగారు. ఆప్ ఓటమికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు, పారదర్శకతకు ప్రజాస్వామ్య వేదికగా ఏర్పాటు చేసిన ఆప్ స్వభావాన్ని కేజ్రీవాల్ మార్చారని ఆరోపించారు. లోక్పాల్ని అనుసరించలేదని, సుప్రీం లీడర్గా వ్యవహరించాలని దుయ్యబట్టారు. ఆయన కోసం రూ. 45 కోట్ల శీష్ మహల్ నిర్మించుకున్నారని అన్నారు. “ప్రచారం, ప్రగల్భాలు ద్వారా రాజకీయాలు చేయవచ్చని ఆయన (కేజ్రీవాల్) భావించారు. ఇది ఆప్ ముగింపుకు నాంది” అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Shraddha Walker: శ్రద్ధా వాకర్ తండ్రి మృతి.. చివరి శ్వాస వరకు అందని అస్థికలు..
కేజ్రీవాల్కి 10 క్రితం తాను రాసిన లేఖని ప్రశాంత్ భూష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆప్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెబుతూ, ప్రశాంత్ భూషన్, యోగేంద్ర యాదవ్లపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో ప్రశాంత్ భూషన్ కేజ్రీవాల్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖని పంచుకున్నారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత మీరు ఉత్తమ లక్షణాలు చూపించాలి. కానీ, దురదృష్టవశాత్తు మీ చెత్త లక్షణాలు బయటపడ్డాయి. లోక్పాల్ తొలగింపు, మమ్మల్ని బహిష్కరించడం , రష్యా కమ్యూనిస్ట్ పార్టీలోని అసమ్మతివాదులను స్టాలిన్ ప్రక్షాళన చేసిన విధానాన్ని గుర్తుకు తెస్తుంది. మీరు పార్టీకి చేస్తున్న పనిని దేవుడు, చరిత్ర క్షమించవు’’ అని ఆయన రాశారు.
2015లో ప్రశాంత్ భూషణ్ని పార్టీ నుంచి బహిష్కరించిన సమయంలో కేజ్రీవాల్ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ.. పరిమితులు దాటారని, కుట్రలు పన్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!