Pralhad Joshi: కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగింది.. కేంద్రమంత్రి వింత ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi On Population Surged Due To Lack Of Electricity: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక వింత ప్రకటన చేశారు. కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగిందంటూ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. గురువారం కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రహ్లాద్ మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. వాళ్లు ఉచితంగా కరెంటు ఇస్తారని మీరు నమ్ముతారా? కాంగ్రెస్ తన హయాంలో సరిగ్గా కరెంటు సరఫరా చేయలేకపోయింది. ముఖ్యంగా గ్రామాలైతే అంధకారంలోనే ఉండేవి. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండటం వల్లే మన దేశ జనాభా పెరిగిపోయింది. కానీ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము (బీజేపీ) 24 గంటల విద్యుత్తుని సరఫరా చేయగలుగుతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రహ్లాద్ జోషీ కరెంట్ కోతల విషయంలో కాంగ్రెస్ని విమర్శించడం వరకు బాగానే ఉంది కానీ, దేశ జనాభాతో దాన్ని లింక్ చేయడమే విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోని తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.
Rajasthan No Beard Culture: మీకు గడ్డం ఉందా.. అయితే మీరు పెళ్లికి అర్హులు కారు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
కాగా.. కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు.. విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు పరస్పర విమర్శలకు దిగారు. ఆయా హామీలు సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయంలో ఒక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని మాటిచ్చింది. దీనిపై కౌంటర్ వేయబోతూ.. ప్రహ్లాద్ జోషి పై విధంగా స్పందించారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు కరెంట్ కోతలకి, జనాభా పెరుగుదలకి సంబంధం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ 24 గంటలు కరెంట్ ఉంటే, జనాభా పెరగదా? పిల్లలు పుట్టరా? అని నిలదీస్తున్నారు. అటు.. కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రహ్లాద్ వ్యాఖ్యలు మరింత జుగుస్పాకరంగా ఉన్నాయంటూ కౌంటర్ ఎటాక్ చేసింది.
Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?