Pralhad Joshi: కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగింది.. కేంద్రమంత్రి వింత ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pralhad Joshi On Population Surged Due To Lack Of Electricity: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక వింత ప్రకటన చేశారు. కరెంట్ కోతల వల్లే జనాభా పెరిగిందంటూ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. గురువారం కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రహ్లాద్ మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే ఉచితంగా కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. వాళ్లు ఉచితంగా కరెంటు ఇస్తారని మీరు నమ్ముతారా? కాంగ్రెస్ తన హయాంలో సరిగ్గా కరెంటు సరఫరా చేయలేకపోయింది. ముఖ్యంగా గ్రామాలైతే అంధకారంలోనే ఉండేవి. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండటం వల్లే మన దేశ జనాభా పెరిగిపోయింది. కానీ.. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము (బీజేపీ) 24 గంటల విద్యుత్తుని సరఫరా చేయగలుగుతున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రహ్లాద్ జోషీ కరెంట్ కోతల విషయంలో కాంగ్రెస్ని విమర్శించడం వరకు బాగానే ఉంది కానీ, దేశ జనాభాతో దాన్ని లింక్ చేయడమే విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రహ్లాద్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోని తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.
Rajasthan No Beard Culture: మీకు గడ్డం ఉందా.. అయితే మీరు పెళ్లికి అర్హులు కారు
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
కాగా.. కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు.. విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు పరస్పర విమర్శలకు దిగారు. ఆయా హామీలు సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ విషయంలో ఒక హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని మాటిచ్చింది. దీనిపై కౌంటర్ వేయబోతూ.. ప్రహ్లాద్ జోషి పై విధంగా స్పందించారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు కరెంట్ కోతలకి, జనాభా పెరుగుదలకి సంబంధం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ 24 గంటలు కరెంట్ ఉంటే, జనాభా పెరగదా? పిల్లలు పుట్టరా? అని నిలదీస్తున్నారు. అటు.. కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రహ్లాద్ వ్యాఖ్యలు మరింత జుగుస్పాకరంగా ఉన్నాయంటూ కౌంటర్ ఎటాక్ చేసింది.
Bride Cancel Marriage: కట్నం సరిపోలేదని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?