BJP vs Congress: ‘‘స్వదేశీ ఉగ్రవాదులు ఏంటి..?’’ చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- ఢిల్లీ కార్ బ్లాస్ట్పై రాజకీయ దుమారం..
- స్వదేశీ ఉగ్రవాదులు అని చిదంబరం కామెంట్స్..
- కాంగ్రెస్ నేత కామెంట్స్పై బీజేపీ నేతలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP vs Congress: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడిపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పేలుడు తర్వాత చిదంబరం మాట్లాడుతూ.. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. “పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారని చెప్పానని, అప్పుడు తనను అందరూ ట్రోల్ చేశారని చిదంబరం అన్నారు.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ‘‘కాంగ్రెస్ ఉగ్రవాదులపై సున్నితమైన మద్దతు ఇస్తోంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతీప్ భండారి అన్నారు. ఉగ్రవాదులు ‘‘చంపాల్సిన జంతువులు’’ అని మరో బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఉగ్రవాదులు గాయపడినప్పడు కాంగ్రెస్ అరవడం ప్రారంభిస్తుందని విమర్శించారు. వారు ఉగ్రవాదుల ప్రతినిధులుగా ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదని నఖ్వీ విమర్శించారు.
‘‘ఉగ్రవాదులు ఉగ్రవాదులే . కాంగ్రెస్ నాయకులు ఎలా వర్గీకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ’’ అని కాషాయ పార్టీ సీనియన్ నేత నళిన్ కోహ్లీ అన్నారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ఏం జరుగుతుందో ఆశ్చర్యంగా ఉంది. ఉగ్రవాదానికి కొత్త భాష.? విదేశీ, స్వదేశీ ఉగ్రవాదులా.? ఉగ్రవాది ఉగ్రవాదే’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!