BJP vs Congress: ‘‘స్వదేశీ ఉగ్రవాదులు ఏంటి..?’’ చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- ఢిల్లీ కార్ బ్లాస్ట్పై రాజకీయ దుమారం..
- స్వదేశీ ఉగ్రవాదులు అని చిదంబరం కామెంట్స్..
- కాంగ్రెస్ నేత కామెంట్స్పై బీజేపీ నేతలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP vs Congress: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడిపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పేలుడు తర్వాత చిదంబరం మాట్లాడుతూ.. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. “పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు ఉన్నారని చెప్పానని, అప్పుడు తనను అందరూ ట్రోల్ చేశారని చిదంబరం అన్నారు.
Also Read
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
- Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
- CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ‘‘కాంగ్రెస్ ఉగ్రవాదులపై సున్నితమైన మద్దతు ఇస్తోంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతీప్ భండారి అన్నారు. ఉగ్రవాదులు ‘‘చంపాల్సిన జంతువులు’’ అని మరో బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఉగ్రవాదులు గాయపడినప్పడు కాంగ్రెస్ అరవడం ప్రారంభిస్తుందని విమర్శించారు. వారు ఉగ్రవాదుల ప్రతినిధులుగా ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదని నఖ్వీ విమర్శించారు.
‘‘ఉగ్రవాదులు ఉగ్రవాదులే . కాంగ్రెస్ నాయకులు ఎలా వర్గీకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ’’ అని కాషాయ పార్టీ సీనియన్ నేత నళిన్ కోహ్లీ అన్నారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు ఏం జరుగుతుందో ఆశ్చర్యంగా ఉంది. ఉగ్రవాదానికి కొత్త భాష.? విదేశీ, స్వదేశీ ఉగ్రవాదులా.? ఉగ్రవాది ఉగ్రవాదే’’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..