High Court: రేప్ బాధితులకు గర్భం తొలగించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలియజేయాలి..
Karnataka High Court: అత్యాచార బాధితురాలు గర్భంతో ఉంటే, 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఉందని, ఈ విషయాన్ని బాధితులకు ఆయా పరిధిలోని పోలీసులు చెప్పాలని కర్ణాటక హైకోర్టు దిశానిర్దేశం చేసింది. దీని వల్ల బాధితులు సమయం దాటాక కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని హైకోర్టు చెప్పింది. 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, నేర ఫలితంగా గర్భం దాల్చింది. ఈ గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోక్సో, అత్యాచార సెక్షన్లు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
నేర ఫలితంగా తన కూతురు గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమె 24 వారాల గర్భవతి అని.. బాధితురాలికి ప్రెగ్నెన్సీని కొనసాగించడం ఇష్టం లేదని వైద్యపరంగా రద్దు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ని విచారించిన జస్టిస్ సూరజ్ గోవింద్ రాజ్.. ‘‘ఇలాంటి నిర్ణయం ఇంతకుముందే తీసుకుంటే పిటిషనర్ కోర్టుకు రావాల్సిన అవసరం ఉండేది కాదు’’ అంటూ డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
Read Also: Ponnam Prabhakar: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే..
అత్యాచార బాధితురాలు/ ఆమె సంరక్షకుడు కోరుకుంటే, గర్భ విచ్ఛత్తికి సంబంధించి వైద్యపరంగా అనుసరించాల్సిన విధానం, ప్రక్రియను తెలియజేసేలా దర్యాప్తు అధికారులు, పోలీసులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోర్టు ఆదేశించింది. విచారణ అధికారి తన పరిధిలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యుడిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది.
ప్రస్తుత కేసులో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చేయించుకోవడానికి ముందుగా వైద్య నిపుణులు, శిశు వైద్యుడు, సైకాలజిస్టులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి బాధితురాలి ఫిట్నెస్ పరీక్షించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 12న నివేదిక సమర్పించగా.. ఎంటీపీ చేపట్టేందుకు హైకోర్టు అనుమతించింది. ఎంటీపీ తర్వాత పిండానికి సంబంధించిన కణజాల నమూనాలను డీఎన్ఏ విశ్లేషణ కోసం భద్రపరచాలని పోక్సో ట్రయల్ కోర్టు ఆదేశిస్తే అలాగే చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో