Sonam-Raja Case: ప్రియుడి సాయంతోనే రాజాను సోనమ్ చంపింది.. పోలీసులు వెల్లడి
- ప్రియుడి సాయంతోనే రాజాను సోనమ్ చంపింది
- మేఘాలయ పోలీసులు వెల్లడి
- రెండు వారాల తర్వాత వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది. అతడి శరీరాన్ని చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. తాజాగా జూన్ 9న అతడి భార్య సోనమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి సాయంతో భర్తను చంపేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sonam-Raja Case: రాత్రి 1 ఒంటి గంటకు సోనమ్ ఏడుస్తూ వచ్చింది.. కీలక విషయాలు బయటపెట్టిన ధాబా ఓనర్
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
రాజ్ కుష్వాహా-సోనమ్ ఒకే కంపెనీలో పని చేసేవారని.. వారిద్దరూ ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకునేవారని రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ తెలిపారు. తానెప్పుడూ కూడా రాజ్ కుష్వాను చూడలేదని చెప్పాడు. రాజ్ కుష్వాహా ప్రమేయంతోనే సోనమ్ ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ జంట గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారని.. అకస్మాత్తుగా ప్రణాళిక మార్పు చేసి మేఘాలయకు తీసుకెళ్లడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఇద్దరిలో ఎవరు ప్లాన్ చేశారో తెలియదని.. తిరుగు ప్రయాణ టిక్కెట్లు మాత్రం బుక్ చేసుకోలేదని చెప్పారు. ఇక తన సోదరుడి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదని.. సోనమ్ ప్రమేయం ఉంటే వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Sonam-Raja Wedding: సోనమ్-రాజా వెడ్డింగ్ వీడియో వైరల్.. ఆ సమయంలో సోనమ్ ఎలా ఉందంటే..!
ఇక ఆదివారం అర్ధరాత్రి 1 ఒంటిగంట సమయంలో ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పరిధిలోని నందగంజ్లో ఒక ధాబా దగ్గర తీవ్ర మనస్తాపంతో సోనమ్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇక మేఘాలయ పోలీసులు మాత్రం.. ఆమెనే స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు చెప్పారు.
తండ్రి ఖండన
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు. తన కుమార్తె నిర్దోషి అని, ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. భర్తను చంపే దుర్మా్ర్గురాలు కాదన్నారు. రెండు కుటుంబాల సమ్మతితోనే ఇద్దరికి వివాహం జరిపించినట్లు తెలిపారు. మేఘాలయ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. సోనమ్తో ఇంకా మాట్లాడలేదని.. అయినా ఆమె భర్తను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. కేవలం పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, హోంమంత్రి అమిత్ షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిగితే మేఘాలయ పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!