Sonam-Raja Case: ప్రియుడి సాయంతోనే రాజాను సోనమ్ చంపింది.. పోలీసులు వెల్లడి
- ప్రియుడి సాయంతోనే రాజాను సోనమ్ చంపింది
- మేఘాలయ పోలీసులు వెల్లడి
- రెండు వారాల తర్వాత వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది. అతడి శరీరాన్ని చూసిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. తాజాగా జూన్ 9న అతడి భార్య సోనమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి సాయంతో భర్తను చంపేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sonam-Raja Case: రాత్రి 1 ఒంటి గంటకు సోనమ్ ఏడుస్తూ వచ్చింది.. కీలక విషయాలు బయటపెట్టిన ధాబా ఓనర్
Also Read
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
రాజ్ కుష్వాహా-సోనమ్ ఒకే కంపెనీలో పని చేసేవారని.. వారిద్దరూ ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకునేవారని రాజా రఘువంశీ సోదరుడు విపుల్ రఘువంశీ తెలిపారు. తానెప్పుడూ కూడా రాజ్ కుష్వాను చూడలేదని చెప్పాడు. రాజ్ కుష్వాహా ప్రమేయంతోనే సోనమ్ ఈ హత్యకు పాల్పడి ఉంటుందని పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ జంట గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారని.. అకస్మాత్తుగా ప్రణాళిక మార్పు చేసి మేఘాలయకు తీసుకెళ్లడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. ఇద్దరిలో ఎవరు ప్లాన్ చేశారో తెలియదని.. తిరుగు ప్రయాణ టిక్కెట్లు మాత్రం బుక్ చేసుకోలేదని చెప్పారు. ఇక తన సోదరుడి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇవ్వలేదని.. సోనమ్ ప్రమేయం ఉంటే వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Sonam-Raja Wedding: సోనమ్-రాజా వెడ్డింగ్ వీడియో వైరల్.. ఆ సమయంలో సోనమ్ ఎలా ఉందంటే..!
ఇక ఆదివారం అర్ధరాత్రి 1 ఒంటిగంట సమయంలో ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పరిధిలోని నందగంజ్లో ఒక ధాబా దగ్గర తీవ్ర మనస్తాపంతో సోనమ్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఇక మేఘాలయ పోలీసులు మాత్రం.. ఆమెనే స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు చెప్పారు.
తండ్రి ఖండన
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు. తన కుమార్తె నిర్దోషి అని, ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. భర్తను చంపే దుర్మా్ర్గురాలు కాదన్నారు. రెండు కుటుంబాల సమ్మతితోనే ఇద్దరికి వివాహం జరిపించినట్లు తెలిపారు. మేఘాలయ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. సోనమ్తో ఇంకా మాట్లాడలేదని.. అయినా ఆమె భర్తను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. కేవలం పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, హోంమంత్రి అమిత్ షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిగితే మేఘాలయ పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!