Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీస్ కేసు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలైపై పోలీస్ కేసు నమోదైంది. గత రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చట్టవిరుద్ధంగా సమావేశం, అక్రమ నిర్బంధం, ప్రజలకు ఇబ్బందులు కలిగించిందనుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సెక్షన్లు 143, 341, 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది.
Read Also: Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?
Also Read
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై అల్లర్లను రెచ్చగొడుతున్నారని, ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారని ఆరోపించారు. కోయంబత్తూర్ శాంతియుత నగరమని అన్నారు. అహంకారం గురించి తరుచూ మాట్లాడే ప్రధాని మోడీ అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలి అని అన్నారు. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన అన్నామలై తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు తనకు ఉందని, ఏ ఎన్నికల సంఘం మమ్మల్ని ఆపుతుంది, ఆర్డర్ ఎక్కడ ఉంది, మీరు నాకు చూపించాలి..? అని అడిగారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్నామలై గెలుపును అడ్డకునేందుకు డీఎంకే పన్నాగాలు పన్నుతోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. పోలీసులు, కలెక్టర్లను దుర్వినియోగం చేస్తూ ఈ కేసులు నమోదు చేశారని అన్నారు. బీజేపీ నుంచి అన్నామలై లోక్సభకు పోటీ చేస్తుండటంతో తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సీటు గురించి చర్చ నడుస్తోంది. అధికార డీఎంకే పార్టీ నుంచి గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు తొలివిడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో డీఎంకే, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది.
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!