PM Modi: ‘‘దళితుల్లో అసత్యాలని వ్యాప్తి చేస్తోంది’’.. కాంగ్రెస్పై ధ్వజమెత్తిన పీఎం మోడీ..
- కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర విమర్శలు..
- దళితుల మధ్య అసత్యాలని వ్యాప్తి చేస్తోంది..
- కాంగ్రెస్కి హర్యానా ప్రజలు బుద్ధి చెప్పారు..
PM Modi: హర్యానాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. వరసగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది. జమ్మూ కాశ్మీర్లో అధికారం చేపట్టలేకపోయినప్పటికీ 90 స్థానాల్లో 29 స్థానాలను సాధించింది. ఇక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చావుదెబ్బతింది. రాహుల్ గాంధీ ప్రచారం, అగ్నివీర్ అంశం, నిరుద్యోగం, వినేష్ ఫోగట్ చేరిక, రైతు ఉద్యమాలు ఇలా ఏదీ కూడా బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి. 37 సీట్లలోనే కాంగ్రెస్ గెలిచింది. జమ్మూ కాశ్మీర్లో మరింత దారుణం 6 సీట్లను గెలిచింది.
Read Also: Nobel Prize: కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు
Also Read
- 2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ఇదిలా ఉంటే, హర్యానా ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిని మోడీ.. హర్యానా ప్రజలు కాంగ్రెస్ దాని అర్బన్ నక్సల్ మిత్రపక్షాల విద్వేషపూరిత కుట్రల్ని అడ్డుకున్నారని చెప్పారు. ‘‘నిన్న, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి… రెండు పర్యాయాలు పూర్తి చేసిన తర్వాత, హర్యానాలో మూడవసారి ఎన్నికవ్వడం చారిత్రాత్మకం. మొత్తం కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వారు దళితుల్లో అసత్యాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. దళితుల నుంచి కాంగ్రెస్ రిజర్వేషన్లను లాక్కొని తమ ఓటు బ్యాంకుకు పంచుతుందని దళితులు గ్రహించారు’’ అని మోడీ అన్నారు.
హర్యానాలో దళిత ప్రజల నుంచి బీజేపీకి రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, కాంగ్రెస్ రైతుల్ని ఉసిగొల్పిందని అన్నారు. బీజేపీ రైతుబంధు పథకాలతో హర్యానా రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ యువతను కూడా ఉసిగొల్పే ప్రయత్నాలు చేసిందని, అయినా ప్రజలు బీజేపీనే నమ్మారని ప్రధాని చెప్పారు. నాగ్పూర్లో రూ. 7600 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. వర్చువల్గా నాగ్పూర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు రాష్ట్రంలోని షిర్డీ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది నవంబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
తాజావార్తలు
-
2 States Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
-
TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?