PM Modi: ట్రంప్ నా కోసం తన సెక్యూరిటీని పక్కన పెట్టేశారు.. మోడీ కామెంట్స్..
- ట్రంప్ నా కోసం భద్రతను పక్కన పెట్టారు..
- లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోడీ..
- ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికన్ పాడ్కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్రమోడీ కీలక విషయాలను వెల్లడించారు. హ్యూస్టన్లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ కార్యక్రమం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భద్రతను పక్కన పెట్టారని అన్నారు. వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరైన తీరును మోడీ గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత, ట్రంప్తో కలిసి స్టేడియంలో తిరగడం గురించి చెప్పారు.
‘‘ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి అతని దగ్గరికి వెళ్ళాను, మీకు అభ్యంతరం లేకపోతే మనం స్టేడియం చుట్టూ ఒక రౌండ్ ఎందుకు తిరగకూడదు అని మామూలుగా అన్నాను’’ అని ట్రంప్తో అన్నానని మోడీ చెప్పారు. అందుకు ట్రంప్ ‘‘ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం కలిసి నడుద్దాం, వారిని పలకరిద్దాం అని చెప్పినట్లు మోడీ వెల్లడించారు. అమెరికా కఠినమైన భద్రతా ప్రోటోకాల్లో ఇలాంటి తీరు అసాధారణమని మోడీ చెప్పారు. అమెరికన్ సమాజంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రెసిడెంట్ ఇలా తిరగడం అసాధ్యమని చెప్పారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: BJP MLA: “కేదార్నాథ్లో హిందువులు కాని వారిని నిషేధించాలి”.. మరో వివాదం..
ట్రంప్ ఏ మాత్రం సంకోచించకుండా, తన మాటను అంగీకరించి స్టేడియంలో తిరగడం ప్రారంభించినట్లు మోడీ వెల్లడించారు. ఇది ట్రంప్ భద్రతా సిబ్బందిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు.‘‘ఆ క్షణం నా మనసును తాకిందని, అది అతడి ధైర్యాన్ని చూపించింది’’ అని అన్నారు. గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నం గురంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘ అమెరికా ఎన్నికలకు ముందు ఇటీవల జరిగిన ప్రచారంలో ట్రంప్కు కాల్పులు జరిగినప్పుడు, ఆ స్టేడియంలో నాతో చేయి చేయి కలిపి నడిచిన అదే దృఢ సంకల్పం కలిగిన అధ్యక్షుడు ట్రంప్ను నేను చూశాను’’ అని మోడీ అన్నారు.
‘‘ బుల్లెట్ తాకిన తర్వాత కూడా, ఆయన అమెరికాకు అచంచలంగా అంకితభావాన్ని ప్రదర్శించాడు. అతడి జీవితం దేశం కోసమే. నేను భారతదేశాన్ని నమ్మినట్లే, అతడు అమెరికా స్ఫూర్తిని చూపించారు. నేను భారత్ ఫస్ట్ అని అనుకుంటాను. అందుకే మేము కనెక్ట్ అయ్యాము.’’ అని మోడీ చెప్పారు. జూలై13న పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ట్రంప్ ప్రాణాలు దక్కాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!