Agnipath: అగ్నిపథ్పై రంగంలోకి మోడీ.. త్రివిధ దళాధిపతులతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని అసంజంగా ప్రస్తుతానికి కనిపిస్తున్నా, భవిష్యత్తులో అవన్నీ కూడా దేశ నిర్మాణానికి బలంగా ఉపకరిస్తాయని వ్యాఖ్యానించారు.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Agnipath: అగ్నిపథ్పై ప్రధాని మోడీ పరోక్ష వ్యాఖ్యలు..
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
అగ్నిపథ్ పథకంపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు జూన్ 21న ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ అధిపతులతో సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.. త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానిని కలవనున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముందుగా ప్రధాని మోడీని కలుస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు, కొత్త సైనిక పథకం కింద అగ్నివీర్ల రిక్రూట్మెంట్ను ప్రారంభించడానికి మూడు రక్షణ దళాలు ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఆర్మీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుదారుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్ ప్రత్యేక ర్యాంక్ను ఏర్పరుస్తారని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్ల కంటే భిన్నంగా ఉంటుందని సైన్యం తెలిపింది.
ఇక, నాలుగేళ్ల సేవా వ్యవధిలో పొందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా కూడా వారు నిషేధించబడతారు. ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో భారతదేశం అంతటా అగ్నిపథ్ పథకం కింద మొత్తం 83 ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు జరుగుతాయి. మూడు సర్వీసుల అధికారులు ఆదివారం కొత్త పాలసీ కింద అగ్నివీరుల నమోదుకు సంబంధించిన విస్తృత షెడ్యూల్ను అందించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైనా ఎన్రోల్ చేసే ముందు పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందని, కాల్పులు మరియు హింసకు పాల్పడే యువకులు మూడు సర్వీసుల్లో చేరలేరని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
-
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
-
RCB Success Story: ఆర్సీబీ విజయాల వెనుక ‘పంచ పాండవులు’.. మూడో ఐపీఎల్ టైటిల్ కూడా!
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!