Agnipath: అగ్నిపథ్పై రంగంలోకి మోడీ.. త్రివిధ దళాధిపతులతో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని అసంజంగా ప్రస్తుతానికి కనిపిస్తున్నా, భవిష్యత్తులో అవన్నీ కూడా దేశ నిర్మాణానికి బలంగా ఉపకరిస్తాయని వ్యాఖ్యానించారు.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Agnipath: అగ్నిపథ్పై ప్రధాని మోడీ పరోక్ష వ్యాఖ్యలు..
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
అగ్నిపథ్ పథకంపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు జూన్ 21న ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ అధిపతులతో సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.. త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానిని కలవనున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముందుగా ప్రధాని మోడీని కలుస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు, కొత్త సైనిక పథకం కింద అగ్నివీర్ల రిక్రూట్మెంట్ను ప్రారంభించడానికి మూడు రక్షణ దళాలు ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఆర్మీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుదారుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్ ప్రత్యేక ర్యాంక్ను ఏర్పరుస్తారని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్ల కంటే భిన్నంగా ఉంటుందని సైన్యం తెలిపింది.
ఇక, నాలుగేళ్ల సేవా వ్యవధిలో పొందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా కూడా వారు నిషేధించబడతారు. ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో భారతదేశం అంతటా అగ్నిపథ్ పథకం కింద మొత్తం 83 ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు జరుగుతాయి. మూడు సర్వీసుల అధికారులు ఆదివారం కొత్త పాలసీ కింద అగ్నివీరుల నమోదుకు సంబంధించిన విస్తృత షెడ్యూల్ను అందించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైనా ఎన్రోల్ చేసే ముందు పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందని, కాల్పులు మరియు హింసకు పాల్పడే యువకులు మూడు సర్వీసుల్లో చేరలేరని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!