Agnipath: అగ్నిపథ్పై రంగంలోకి మోడీ.. త్రివిధ దళాధిపతులతో భేటీ
అగ్నిపథ్ పథకం ఇప్పుడు కాకరేపుతోంది.. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, బంద్లు కొనసాగుతుంటే.. మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా నోటిఫికేషన్లకు విడుదల చేస్తోంది కేంద్రం.. దేశవ్యాప్తంగా అగ్నిపథ్పై ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం నిర్వహించగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు.. రేపు అనగా మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశం కాబోతున్నారు ప్రధాని మోడీ.. కర్ణాటక పర్యటనలో అగ్నిపథ్పై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. కొన్ని అసంజంగా ప్రస్తుతానికి కనిపిస్తున్నా, భవిష్యత్తులో అవన్నీ కూడా దేశ నిర్మాణానికి బలంగా ఉపకరిస్తాయని వ్యాఖ్యానించారు.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Agnipath: అగ్నిపథ్పై ప్రధాని మోడీ పరోక్ష వ్యాఖ్యలు..
Also Read
అగ్నిపథ్ పథకంపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు జూన్ 21న ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ అధిపతులతో సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.. త్రివిధ దళాల అధిపతులు ప్రత్యేకంగా ప్రధానిని కలవనున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముందుగా ప్రధాని మోడీని కలుస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు, కొత్త సైనిక పథకం కింద అగ్నివీర్ల రిక్రూట్మెంట్ను ప్రారంభించడానికి మూడు రక్షణ దళాలు ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేశాయి. ఆర్మీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుదారుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్ ప్రత్యేక ర్యాంక్ను ఏర్పరుస్తారని, ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్ల కంటే భిన్నంగా ఉంటుందని సైన్యం తెలిపింది.
ఇక, నాలుగేళ్ల సేవా వ్యవధిలో పొందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా కూడా వారు నిషేధించబడతారు. ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో భారతదేశం అంతటా అగ్నిపథ్ పథకం కింద మొత్తం 83 ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు జరుగుతాయి. మూడు సర్వీసుల అధికారులు ఆదివారం కొత్త పాలసీ కింద అగ్నివీరుల నమోదుకు సంబంధించిన విస్తృత షెడ్యూల్ను అందించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. మిలిటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైనా ఎన్రోల్ చేసే ముందు పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందని, కాల్పులు మరియు హింసకు పాల్పడే యువకులు మూడు సర్వీసుల్లో చేరలేరని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో