PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ నుంచి , మా దిల్ నుంచి దూరం కాలేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి కమలం విరబూసింది. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఈ ఫలితాలు చూపిస్తున్నాయని అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న దృఢ విశ్వాసానికి ఈ గెలుపే నిదర్శనం అని అన్నారు.
Read Also: Seediri Appalaraju: సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
Also Read
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ నుంచి మా దిల్ (హృదయం) నుంచి దూరం కాదని ఈ ఎన్నికలే చూపిస్తున్నాయని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం కోసం కష్టపడిన కార్యకర్తలను, నేతలను ప్రధాని అభినందించారు. త్రిపుర, మేఘాలయ మరియు నాగాలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నిలకు అంటే హింస కనిపించేదని, కానీ ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ప్రధాని అన్నారు. చాలా మంది పొలిటికల్ అనలిస్టులు బీజేపీ ఎలా విజయం సాధించిందని అనుకుంటారని..దానికి ‘త్రివేణి’ కారణం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పని, బీజేపీ పనిచేసే విధానం, బీజేపీ కార్యకర్తలే ఈ విజయానికి కారణం అని అన్నారు.
గురువారం వెలువడిని ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. త్రిపురలో బీజేపీ సునాయాస విజయం సాధించింది. ఇక నాగాలాండ్ రాష్ట్రంలో మిత్రపక్షం నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ( ఎన్డీపీపీ) పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మేఘాలయలో పాత మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా, మ్యాజిక్ ఫిగర్ ను దాటలేదు. అయితే మరోసారి బీజేపీతో, ఎన్పీపీ చేతులు కలిపి అధికారంలోకి రానుంది.
తాజావార్తలు
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?