Budget 2024: ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
- ఆర్థిక వేత్తలు... నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
- 2024-25కి పూర్తి స్థాయి బడ్జెట్కు కసరత్తు
- ఈనెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ 3.0 సర్కార్ తొలిసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. మిత్రపక్షాల సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బడ్జెట్పై అన్ని రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ప్రధానంగా మిత్రపక్షాల రాష్ట్రాలైతే గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన బడ్జెట్ కసరత్తుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ప్రణాళిక మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సూర్జిత్ భల్లా, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కెవి కామత్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించనుంది. కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి విస్తృత సంప్రదింపులలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సీనియర్ నీతి ఆయోగ్ అధికారులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ను రూపొందించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాబోయే బడ్జెట్పై తమ అభిప్రాయాలను సేకరించేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటికే భారతీయ పరిశ్రామికవేత్తలు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ఆర్థికవేత్తలతో విస్తృత చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: Maharaja: మహారాజా వస్తున్నాడు.. పరాక్ బహు పరాక్
లోక్సభ ఎన్నికలకు ముందు నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024-25 కోసం పూర్తి బడ్జెట్ను సమర్పించనున్నారు. మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with economists ahead of the Union budget which will be presented on July 23; Union Finance Minister Nirmala Sitharaman also present
(Source: DD News) pic.twitter.com/OkTX2Zb9s6
— ANI (@ANI) July 11, 2024
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with economists ahead of the Union budget which will be presented on July 23; Union Finance Minister Nirmala Sitharaman also present
(Source: DD News) pic.twitter.com/hlgxNfDJ9P
— ANI (@ANI) July 11, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!