Budget 2024: ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
- ఆర్థిక వేత్తలు... నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
- 2024-25కి పూర్తి స్థాయి బడ్జెట్కు కసరత్తు
- ఈనెల 23న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ
మోడీ 3.0 సర్కార్ తొలిసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. మిత్రపక్షాల సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బడ్జెట్పై అన్ని రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ప్రధానంగా మిత్రపక్షాల రాష్ట్రాలైతే గంపెడాశలు పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన బడ్జెట్ కసరత్తుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికవేత్తలు, నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ప్రణాళిక మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సూర్జిత్ భల్లా, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రముఖ బ్యాంకర్ కెవి కామత్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించనుంది. కేంద్ర బడ్జెట్ 2024-25కి సంబంధించి విస్తృత సంప్రదింపులలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సీనియర్ నీతి ఆయోగ్ అధికారులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ను రూపొందించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాబోయే బడ్జెట్పై తమ అభిప్రాయాలను సేకరించేందుకు ఆర్థిక మంత్రి సీతారామన్ ఇప్పటికే భారతీయ పరిశ్రామికవేత్తలు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ఆర్థికవేత్తలతో విస్తృత చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: Maharaja: మహారాజా వస్తున్నాడు.. పరాక్ బహు పరాక్
లోక్సభ ఎన్నికలకు ముందు నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2024-25 కోసం పూర్తి బడ్జెట్ను సమర్పించనున్నారు. మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with economists ahead of the Union budget which will be presented on July 23; Union Finance Minister Nirmala Sitharaman also present
(Source: DD News) pic.twitter.com/OkTX2Zb9s6
— ANI (@ANI) July 11, 2024
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with economists ahead of the Union budget which will be presented on July 23; Union Finance Minister Nirmala Sitharaman also present
(Source: DD News) pic.twitter.com/hlgxNfDJ9P
— ANI (@ANI) July 11, 2024
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?