Cable Bridge Collapse: ఆ బాధ వర్ణనాతీతం.. వంతెన ఘటనపై మోడీ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi About Gujarat Cable Bridge Incident: గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని ఎంతో బాధించిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. గుజరాత్లోని కేవడియాలో ఐక్యతా ప్రతిమ వద్ద మోడీ నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘నేను కేవడియాలో ఉన్నప్పటికీ, నా ఆలోచనంతా మోర్బీ ఘటన మీదే ఉంది. నేను ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా అరుదు. ఒకవైపు గుండె అంతా విషాదం నిండి ఉన్నా.. తప్పక నిర్వహించాల్సిన విధులు ఉండటంతో బాధితుల్ని పరామర్శించే అవకాశం దొరకలేదు’’ అని మోడీ పేర్కొన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే తాను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడానని, ఆయన మోర్బీకి చేరుకున్నారని మోడీ తెలిపారు. సహాయక చర్యలను సీఎం దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని హామీ ఇస్తున్నానని చెప్పిన మోడీ.. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. ఈ కష్ట సమయాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడినవారికి తక్షణ వైద్యం అందేలా చూస్తున్నామని మోడీ విచారం వ్యక్తం చేశారు. సవాళ్లను ఎదుర్కొంటూనే.. తన పనిని కొనసాగించిన విషయంలో పటేల్ ఆదర్శమని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ ఘటనపై నిన్న రాత్రే బాధిత కుటుంబాలకు మోడీ పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే! మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ఇదిలావుండగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ 132 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చాలామంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 177 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడగా.. బృందాలు ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ, నది ఒడ్డుకు చేరుకున్నారు.
తాజావార్తలు
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!